భారత్పై మరోసారి విరుచుకుపడ్డ ట్రంప్..
- June 11, 2018
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై మరోసారి విరుచుకుపడ్డారు. అమెరికా వస్తువులపై భారత్ 100 శాతం సుంకాన్ని వసూలు చేయడంపై ఆయన మండిపడ్డారు. అమెరికాను దోచుకునేందుకు ప్రయత్నించే దేశాలతో అవసరమైతే వాణిజ్య సంబంధాలను తెంచుకునేందుకు సైతం వెనుకాబడబోమని హెచ్చరించారు. పలు దేశాలు అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై వాణిజ్య పన్నులు అధికంగా వసూలు చేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. అందరూ అమెరికానే దోచుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. అమెరికా సంపదకు నష్టం వాటిల్లే విధంగా ఉంటే ఇతర దేశాలతో ఉన్న వాణిజ్య సంబంధాలను తెంచుకుంటామని ట్రంప్ హెచ్చరించారు.
భారత్లో తమ వస్తువులపై వంద శాతం సుంకాన్ని విధిస్తున్నారని, కానీ తాము మాత్రం విధించడం లేదని ట్రంప్ తెలిపారు. తాము అలా వసూలు చెయ్యలేకపోతున్నామన్నారు. అమెరికా నుంచి దిగుమతి అవుతున్నహార్లీ డేవిడ్సన్ బైకులపై భారత్ అధిక శాతం పన్నులు వసూలు చేస్తుందని గతంలో ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికా-భారత్ మధ్య వాణిజ్య సంబంధాలు సంతృప్తికరంగా లేవు. ఈ నేపథ్యంలో మరోసారి ట్రంప్ భారత్ పేరు వాడుతూ కామెంట్స్ చేయడంతో టెన్షన్ నెలకొంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..