వాట్సాప్ స్కామ్పై వినియోగదారుల్ని హెచ్చరించిన ఒమన్టెల్
- June 13, 2018
మస్కట్:వాట్సాప్ ద్వారా స్కామర్స్ వినియోగదారుల్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఒమన్ టెల్ తన వినియోగదారుల్ని హెచ్చరించింది. ఒమన్ టెల్ నుంచి సర్వే పేరుతో లింక్ని వాట్సాప్ ద్వారా స్కామర్స్ పంపి, వినియోగదారుల్ని మోసం చేస్తున్నారని ఒమన్ టెల్ పేర్కొంది. కొన్ని ప్రశ్నల్ని అడగడం, ఆ తర్వాత క్రెడిట్ కార్డు డిటెయిల్స్ సేకరించడం ద్వారా వినియోగదారుల్ని స్కామర్స్ నట్టేట్లో ముంచుతున్నట్లు ఒమన్ టెల్ తెలిపింది. ఒమన్ టెల్ నుంచి ఎవరూ క్రెడిట్ కార్డ్ లేదా బ్యాక్ డిటెయిల్స్ని సేకరించబోరనీ, అలా ఎవరైనా ఒమన్ టెల్ పేరుతో స్కామ్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలుంటాయనీ, వినియోగదారులు సైతం ఈ విషయంలో అప్రమత్తంగా వుండాలని, ఖరీదైన బహుమతులు వస్తాయని మోసపోవద్దని ఒమన్ టెల్ సూచించింది.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







