మిలియన్ డాలర్లు ఎగ్గొట్టిన బాద్షాలు..
- June 15, 2018
ఓ సినిమాలో నటిస్తే కోట్లు.. ఒక్క యాడ్లో కనిపిస్తే లక్షలు.. ఓ షాపుకి రిబ్బన్ కట్ చేస్తే చేతిలో చెక్కులు. ఇదీ సినిమాల్లో స్టార్లుగా చెలామణి అవుతున్న వారి పరిస్థితి. ఏదైనా కాన్సర్ట్ చేస్తే అభిమానుల ఆనందత్సోహాలు, చేతినిండా వద్దంటే వచ్చి పడుతున్న డబ్బులు. ఇలానే అమెరికాలో వైబ్రంట్ మీడియా తలపెట్టిన ఓ కాన్సర్ట్కి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, ప్రభుదేవా, కత్రినా కైఫ్, సోనాక్షి సిన్హా, రణ్వీర్ సింగ్, అక్షయ్ కుమార్, గాయకుడు ఉదిత్ నారాయణ్ తదితరులంతా పాల్గొనవలసి ఉంది. దీనికోసం ఆ సంస్థ వీరితో మిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. ముందే వారికి నగదును ముట్టజెప్పింది. ఈవెంట్ 2013, సెప్టెంబర్ 1న జరగాల్సి ఉంది. అయితే అప్పటికే సల్మాన్ కృష్ణజింకల కేసులో నిందితుడిగా ఉన్నందున న్యాయస్థానానికి హాజరు కావాల్సి ఉంది. అందుకే కాన్సర్ట్ని వాయిదా వేశారు. దీంతో తీసుకున్నపారితోషికాన్ని తిరిగి ఇచ్చేస్తామని చెప్పిన సెలబ్రిటీలు ఇంతవరకు నగదు వాపసు ఇవ్వలేదని వైబ్రంట్ మీడియా పిటిషన్లో పేర్కొంది. ఎన్ని సార్లు ఫోన్లు చేసినా కూడా స్పందించట్లేదు. సల్మాన్కి 2 లక్షల డాలర్లు, కత్రినాకు 40 వేల డాలర్లు, సోనాక్షికి 36వేల డాలర్లు ఇచ్చినా ఏ ఒక్కరూ తిరిగి ఇవ్వలేదని వాపోతున్నారు. దీనిపై ఇల్లినాయిస్ డిస్ట్రిక్ట్ కోర్టు విచారణ జరుపుతోందని సంస్ధ పేర్కొంది.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







