మిలియన్ డాలర్లు ఎగ్గొట్టిన బాద్షాలు..
- June 15, 2018
ఓ సినిమాలో నటిస్తే కోట్లు.. ఒక్క యాడ్లో కనిపిస్తే లక్షలు.. ఓ షాపుకి రిబ్బన్ కట్ చేస్తే చేతిలో చెక్కులు. ఇదీ సినిమాల్లో స్టార్లుగా చెలామణి అవుతున్న వారి పరిస్థితి. ఏదైనా కాన్సర్ట్ చేస్తే అభిమానుల ఆనందత్సోహాలు, చేతినిండా వద్దంటే వచ్చి పడుతున్న డబ్బులు. ఇలానే అమెరికాలో వైబ్రంట్ మీడియా తలపెట్టిన ఓ కాన్సర్ట్కి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, ప్రభుదేవా, కత్రినా కైఫ్, సోనాక్షి సిన్హా, రణ్వీర్ సింగ్, అక్షయ్ కుమార్, గాయకుడు ఉదిత్ నారాయణ్ తదితరులంతా పాల్గొనవలసి ఉంది. దీనికోసం ఆ సంస్థ వీరితో మిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. ముందే వారికి నగదును ముట్టజెప్పింది. ఈవెంట్ 2013, సెప్టెంబర్ 1న జరగాల్సి ఉంది. అయితే అప్పటికే సల్మాన్ కృష్ణజింకల కేసులో నిందితుడిగా ఉన్నందున న్యాయస్థానానికి హాజరు కావాల్సి ఉంది. అందుకే కాన్సర్ట్ని వాయిదా వేశారు. దీంతో తీసుకున్నపారితోషికాన్ని తిరిగి ఇచ్చేస్తామని చెప్పిన సెలబ్రిటీలు ఇంతవరకు నగదు వాపసు ఇవ్వలేదని వైబ్రంట్ మీడియా పిటిషన్లో పేర్కొంది. ఎన్ని సార్లు ఫోన్లు చేసినా కూడా స్పందించట్లేదు. సల్మాన్కి 2 లక్షల డాలర్లు, కత్రినాకు 40 వేల డాలర్లు, సోనాక్షికి 36వేల డాలర్లు ఇచ్చినా ఏ ఒక్కరూ తిరిగి ఇవ్వలేదని వాపోతున్నారు. దీనిపై ఇల్లినాయిస్ డిస్ట్రిక్ట్ కోర్టు విచారణ జరుపుతోందని సంస్ధ పేర్కొంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







