మిలియన్ డాలర్లు ఎగ్గొట్టిన బాద్షాలు..
- June 15, 2018
ఓ సినిమాలో నటిస్తే కోట్లు.. ఒక్క యాడ్లో కనిపిస్తే లక్షలు.. ఓ షాపుకి రిబ్బన్ కట్ చేస్తే చేతిలో చెక్కులు. ఇదీ సినిమాల్లో స్టార్లుగా చెలామణి అవుతున్న వారి పరిస్థితి. ఏదైనా కాన్సర్ట్ చేస్తే అభిమానుల ఆనందత్సోహాలు, చేతినిండా వద్దంటే వచ్చి పడుతున్న డబ్బులు. ఇలానే అమెరికాలో వైబ్రంట్ మీడియా తలపెట్టిన ఓ కాన్సర్ట్కి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, ప్రభుదేవా, కత్రినా కైఫ్, సోనాక్షి సిన్హా, రణ్వీర్ సింగ్, అక్షయ్ కుమార్, గాయకుడు ఉదిత్ నారాయణ్ తదితరులంతా పాల్గొనవలసి ఉంది. దీనికోసం ఆ సంస్థ వీరితో మిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. ముందే వారికి నగదును ముట్టజెప్పింది. ఈవెంట్ 2013, సెప్టెంబర్ 1న జరగాల్సి ఉంది. అయితే అప్పటికే సల్మాన్ కృష్ణజింకల కేసులో నిందితుడిగా ఉన్నందున న్యాయస్థానానికి హాజరు కావాల్సి ఉంది. అందుకే కాన్సర్ట్ని వాయిదా వేశారు. దీంతో తీసుకున్నపారితోషికాన్ని తిరిగి ఇచ్చేస్తామని చెప్పిన సెలబ్రిటీలు ఇంతవరకు నగదు వాపసు ఇవ్వలేదని వైబ్రంట్ మీడియా పిటిషన్లో పేర్కొంది. ఎన్ని సార్లు ఫోన్లు చేసినా కూడా స్పందించట్లేదు. సల్మాన్కి 2 లక్షల డాలర్లు, కత్రినాకు 40 వేల డాలర్లు, సోనాక్షికి 36వేల డాలర్లు ఇచ్చినా ఏ ఒక్కరూ తిరిగి ఇవ్వలేదని వాపోతున్నారు. దీనిపై ఇల్లినాయిస్ డిస్ట్రిక్ట్ కోర్టు విచారణ జరుపుతోందని సంస్ధ పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







