తాలిబన్ చీఫ్ హతం...
- June 15, 2018
అమెరికా నిర్వహించిన డ్రోన్ దాడుల్లో... తాలిబన్లకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ దాడుల్లో తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్(టీటీపీ) చీఫ్ ముల్లా ఫజల్ ఉల్లాహ్ మృతిచెందినట్టు అమెరికా మిలిటరీ ప్రకటించింది. కునార్ ప్రావిన్స్ ప్రాంతంలో కౌంటర్ టెర్రరిజం శాఖ నిర్వహించిన దాడుల్లో ముల్లా ఫజల్ చనిపోయాడని ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ మార్టిన్ ఓడోనిల్ వెల్లడించారు. ఆఫ్ఘన్-పాక్ సరిహద్దుల్లో జూన్ 13వ తేదీన ఈ దాడులు జరిగాయి. అమెరికా, పాకిస్థాన్లో ముల్లా ఫజల్ అనేక దాడులకు సూత్రధారిగా వ్యవహరించినట్లు అమెరికా ప్రకటించింది. డిసెంబర్ 2014లో పెషావర్ ఆర్మీ స్కూల్లో జరిగిన భీకర దాడికి ముల్లానే సూత్రధారి. ఆ దాడిలో సుమారు 151 మంది ప్రాణాలు కోల్పోగా... వారిలో 130 మంది చిన్నారులే... ఇక 2012లో నోబెల్ గ్రహీత మలాలా యూసుఫ్జాహీపై హత్యకు కూడా అతనే కుట్ర పన్నాడు. ముల్లా తలపై 5 మిలియన్ల డాలర్ల నజరానా కూడా ఉంది. అయితే ముల్లా ఫజల్ ఉల్లాహ్ మృతిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!







