తాలిబన్ చీఫ్ హతం...
- June 15, 2018
అమెరికా నిర్వహించిన డ్రోన్ దాడుల్లో... తాలిబన్లకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ దాడుల్లో తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్(టీటీపీ) చీఫ్ ముల్లా ఫజల్ ఉల్లాహ్ మృతిచెందినట్టు అమెరికా మిలిటరీ ప్రకటించింది. కునార్ ప్రావిన్స్ ప్రాంతంలో కౌంటర్ టెర్రరిజం శాఖ నిర్వహించిన దాడుల్లో ముల్లా ఫజల్ చనిపోయాడని ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ మార్టిన్ ఓడోనిల్ వెల్లడించారు. ఆఫ్ఘన్-పాక్ సరిహద్దుల్లో జూన్ 13వ తేదీన ఈ దాడులు జరిగాయి. అమెరికా, పాకిస్థాన్లో ముల్లా ఫజల్ అనేక దాడులకు సూత్రధారిగా వ్యవహరించినట్లు అమెరికా ప్రకటించింది. డిసెంబర్ 2014లో పెషావర్ ఆర్మీ స్కూల్లో జరిగిన భీకర దాడికి ముల్లానే సూత్రధారి. ఆ దాడిలో సుమారు 151 మంది ప్రాణాలు కోల్పోగా... వారిలో 130 మంది చిన్నారులే... ఇక 2012లో నోబెల్ గ్రహీత మలాలా యూసుఫ్జాహీపై హత్యకు కూడా అతనే కుట్ర పన్నాడు. ముల్లా తలపై 5 మిలియన్ల డాలర్ల నజరానా కూడా ఉంది. అయితే ముల్లా ఫజల్ ఉల్లాహ్ మృతిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







