తాలిబన్ చీఫ్ హతం...
- June 15, 2018
అమెరికా నిర్వహించిన డ్రోన్ దాడుల్లో... తాలిబన్లకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ దాడుల్లో తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్(టీటీపీ) చీఫ్ ముల్లా ఫజల్ ఉల్లాహ్ మృతిచెందినట్టు అమెరికా మిలిటరీ ప్రకటించింది. కునార్ ప్రావిన్స్ ప్రాంతంలో కౌంటర్ టెర్రరిజం శాఖ నిర్వహించిన దాడుల్లో ముల్లా ఫజల్ చనిపోయాడని ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ మార్టిన్ ఓడోనిల్ వెల్లడించారు. ఆఫ్ఘన్-పాక్ సరిహద్దుల్లో జూన్ 13వ తేదీన ఈ దాడులు జరిగాయి. అమెరికా, పాకిస్థాన్లో ముల్లా ఫజల్ అనేక దాడులకు సూత్రధారిగా వ్యవహరించినట్లు అమెరికా ప్రకటించింది. డిసెంబర్ 2014లో పెషావర్ ఆర్మీ స్కూల్లో జరిగిన భీకర దాడికి ముల్లానే సూత్రధారి. ఆ దాడిలో సుమారు 151 మంది ప్రాణాలు కోల్పోగా... వారిలో 130 మంది చిన్నారులే... ఇక 2012లో నోబెల్ గ్రహీత మలాలా యూసుఫ్జాహీపై హత్యకు కూడా అతనే కుట్ర పన్నాడు. ముల్లా తలపై 5 మిలియన్ల డాలర్ల నజరానా కూడా ఉంది. అయితే ముల్లా ఫజల్ ఉల్లాహ్ మృతిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..