హైబీపి ఉన్నవారికి ఈ చిట్కాలు...
- June 16, 2018
చాలామంది తమకు బీపి ఉందన్న విషయం తెలియకుండా అలానే ఉండిపోవడంతో భవిష్యత్తులో అది గుండెపోటు, మధుమేహం వంటి ప్రాణాంతక సమస్యలకు కారణమవుతుంది. ఇలాంటి వాటికి కొన్ని చిట్కాలను పాటిస్తే కొంతవరకు వ్యాధులను నివారించవచ్చును. అవేంటో తెలుసుకుందాం.
అధిక రక్తపోటుకు ప్రధాన శత్రువు ఉప్పు, మనం రోజూ వాడే ఉప్పులో ఉండే సోడియం రక్తంలో ద్రవాభిసరణ ప్రక్రియపై ప్రభావం చూపుతుంది. దీంతో రక్త తీవ్రత పెరుగుతుంది. అధికరక్తపోటు సమస్య ఉన్నవారు వీలైనంతవరకు ఉప్పును తక్కువ వాడటం ఉత్తమం. ఇంకా చెప్పాలంటే రక్తపోటు ఉన్నవారు రోజుకు 5 మిల్లీ గ్రాములు ఉప్పును మాత్రమే వినియోగించాలి.
పెరుగన్నం తినేటప్పుడు ఉప్పును ఎక్కువగా తీసుకోకూడదు. పండ్ల రసం తీసుకునేవారు ఉప్పును వాడడం తగ్గించుకుంటే మంచిది. అలాగే చిప్స్, మిక్చర్ లాంటి వాటిలో ఎక్కువగా ఉప్పును వాడుతారు కాబట్టి వాటిని తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కావున వీలైనంతవరకు ఉప్పును తక్కువగా వాడడం అలావాటు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







