శ్మశానాల వద్ద ఉచిత వైఫై ..
- December 10, 2015
సమాధుల వద్ద... ఉచిత వైఫై సదుపాయం మాస్కో అధికారుల నిర్ణయం రష్యా రాజధాని మాస్కోలో అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. నగరంలో ప్రజలు సమూహాలుగా సంచరించే ప్రదేశాల్లో ఉచిత వైఫై సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా నగరంలో ఉన్న మూడు ప్రధాన శ్మశానాల వద్ద కూడా వచ్చే ఏడాది నుంచి ఉచిత వైఫై సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ శ్మశానాలు చారిత్రక ప్రాధాన్యం కలవని, పలువురు రష్యన్ వీరుల సమాధులు అక్కడ ఉన్నాయని, ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం వల్ల అక్కడికి సందర్శకులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. శ్మశానాల వద్ద సందర్శకులు సేదతీరడానికి ఏర్పాటుచేసే ప్రత్యేక ప్రాంతంలో ఈ ఇంటర్నెట్ వసతి కల్పిస్తారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







