తెలుగు న్యూస్ రీడర్ ఆత్మహత్య..!
- June 18, 2018
ఈ మద్య కాలంలో వెండితెర, బుల్లితెరపై వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ న్యూస్ రీడర్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఓ న్యూస్ ఛానల్ లో న్యూస్ రీడర్ గా పని చేసిన తేజశ్విని నిన్న రాత్రి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..విజయవాడ శివార్లలో ఉన్న ఈడుపుగల్లు ఎంబీఎంఆర్ కాలనీలో గత కొంతకాలంగా తేజశ్విని, ఆమె భర్త పవన్ కుమార్ ఉంటున్నారు.
తేజశ్విని ఓ ఛానల్ లో పని చేసేది. పవన్ కుమార్ ఉయ్యూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. గత కొంత కాలంగా కుటుంబంలో చిన్న చిన్న కలతలు రావడం పెద్దవాళ్లు సర్ధి చెప్పడం జరుగతూ వస్తుందట. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి అత్త అన్నపూర్ణాదేవితో తేజశ్విని గొడవ పడింది. కొద్ది సేపటి తర్వాత తేజశ్విని తన ఇంట్లోకి వెళ్లి గది తలుపులు పెట్టుకొని ఎంత సేపటికీ తీయలేదట.
ఎంతకూ తేజశ్విని రాకపోవడంతో... అనుమానం వచ్చిన అత్త గదిలోకి వెళ్లి చూసింది. గదిలోకి వెళ్లిన తేజశ్విని ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఉండటం చూసి షాక్ తిన్నది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







