తెలుగు న్యూస్ రీడర్ ఆత్మహత్య..!
- June 18, 2018
ఈ మద్య కాలంలో వెండితెర, బుల్లితెరపై వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ న్యూస్ రీడర్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఓ న్యూస్ ఛానల్ లో న్యూస్ రీడర్ గా పని చేసిన తేజశ్విని నిన్న రాత్రి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..విజయవాడ శివార్లలో ఉన్న ఈడుపుగల్లు ఎంబీఎంఆర్ కాలనీలో గత కొంతకాలంగా తేజశ్విని, ఆమె భర్త పవన్ కుమార్ ఉంటున్నారు.
తేజశ్విని ఓ ఛానల్ లో పని చేసేది. పవన్ కుమార్ ఉయ్యూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. గత కొంత కాలంగా కుటుంబంలో చిన్న చిన్న కలతలు రావడం పెద్దవాళ్లు సర్ధి చెప్పడం జరుగతూ వస్తుందట. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి అత్త అన్నపూర్ణాదేవితో తేజశ్విని గొడవ పడింది. కొద్ది సేపటి తర్వాత తేజశ్విని తన ఇంట్లోకి వెళ్లి గది తలుపులు పెట్టుకొని ఎంత సేపటికీ తీయలేదట.
ఎంతకూ తేజశ్విని రాకపోవడంతో... అనుమానం వచ్చిన అత్త గదిలోకి వెళ్లి చూసింది. గదిలోకి వెళ్లిన తేజశ్విని ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఉండటం చూసి షాక్ తిన్నది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







