తెలుగు న్యూస్ రీడర్ ఆత్మహత్య..!
- June 18, 2018
ఈ మద్య కాలంలో వెండితెర, బుల్లితెరపై వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ న్యూస్ రీడర్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఓ న్యూస్ ఛానల్ లో న్యూస్ రీడర్ గా పని చేసిన తేజశ్విని నిన్న రాత్రి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..విజయవాడ శివార్లలో ఉన్న ఈడుపుగల్లు ఎంబీఎంఆర్ కాలనీలో గత కొంతకాలంగా తేజశ్విని, ఆమె భర్త పవన్ కుమార్ ఉంటున్నారు.
తేజశ్విని ఓ ఛానల్ లో పని చేసేది. పవన్ కుమార్ ఉయ్యూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. గత కొంత కాలంగా కుటుంబంలో చిన్న చిన్న కలతలు రావడం పెద్దవాళ్లు సర్ధి చెప్పడం జరుగతూ వస్తుందట. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి అత్త అన్నపూర్ణాదేవితో తేజశ్విని గొడవ పడింది. కొద్ది సేపటి తర్వాత తేజశ్విని తన ఇంట్లోకి వెళ్లి గది తలుపులు పెట్టుకొని ఎంత సేపటికీ తీయలేదట.
ఎంతకూ తేజశ్విని రాకపోవడంతో... అనుమానం వచ్చిన అత్త గదిలోకి వెళ్లి చూసింది. గదిలోకి వెళ్లిన తేజశ్విని ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఉండటం చూసి షాక్ తిన్నది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







