శ్రీనగర్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన
- June 20, 2018
జమ్మూ:రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పూంఛ్ సెక్టార్లోని మెందార్లో పర్యటించారు. ఇటీవలే ఉగ్రవాదుల కాల్పుల్లో అమరుడైన జవాన్ ఔరంగజేబ్ కుటుంబాన్ని పరామర్శించారు. నిర్మలా సీతారామన్కు రక్షణగా.. పెద్ద సంఖ్యలో భద్రతా దళాలను మోహరించారు. ఉగ్రదాడులకు ఆస్కారం ఉండడంతో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఔరంగజేబ్ నివాసం దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ నిర్మల వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. జూన్ 14న జవాను ఔరంగజేబ్ను ఉగ్రవాదులు బలి తీసుకున్నారు. ఆ తర్వత ఔరంగజేబ్ తండ్రి చేసిన వ్యాఖ్యలు వారి ఆక్రోషాన్ని ప్రపంచానికి తెలిపాయి. తన కుమారున్ని చంపిన వారిని 24 గంటల్లో చంపేయాలని భారత ఆర్మీని కోరాడు. ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ పరామర్శ ప్రాధాన్యం సంతరించుకుంది.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







