శ్రీనగర్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన
- June 20, 2018
జమ్మూ:రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పూంఛ్ సెక్టార్లోని మెందార్లో పర్యటించారు. ఇటీవలే ఉగ్రవాదుల కాల్పుల్లో అమరుడైన జవాన్ ఔరంగజేబ్ కుటుంబాన్ని పరామర్శించారు. నిర్మలా సీతారామన్కు రక్షణగా.. పెద్ద సంఖ్యలో భద్రతా దళాలను మోహరించారు. ఉగ్రదాడులకు ఆస్కారం ఉండడంతో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఔరంగజేబ్ నివాసం దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ నిర్మల వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. జూన్ 14న జవాను ఔరంగజేబ్ను ఉగ్రవాదులు బలి తీసుకున్నారు. ఆ తర్వత ఔరంగజేబ్ తండ్రి చేసిన వ్యాఖ్యలు వారి ఆక్రోషాన్ని ప్రపంచానికి తెలిపాయి. తన కుమారున్ని చంపిన వారిని 24 గంటల్లో చంపేయాలని భారత ఆర్మీని కోరాడు. ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ పరామర్శ ప్రాధాన్యం సంతరించుకుంది.
తాజా వార్తలు
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!









