పారిస్:ట్రైన్లో పుట్టాడు.. అదృష్టం పట్టేశాడు
- June 20, 2018
పారిస్:ఇక్కడా, అక్కడా పుడితే అదృష్టం వరించదండీ.. ప్యారిస్లో.. అది కూడా అక్కడి ట్రైన్లో పుడితేనే 25 ఏళ్లవరకు ఉచితంగా రైలు ప్రయాణం చేయవచ్చు. ఇది అందరికీ వర్తిస్తుందో లేదో తెలియదు కానీ ఓ బుజ్జాయికి మాత్రం ఇది వర్తింపజేసారు రైలు అధికారులు. అనుకున్న సమయాని రైలు రాలేదు. ఆలస్యంగా వచ్చింది. దాంతో రైలెక్కి ఆసుపత్రికి వెళ్లాలనుకున్న ఓ మహిళ ఆలస్యంగా వచ్చిన రైలెక్కి పురుటి నొప్పులతో ఇబ్బంది పడుతోంది. పక్కనే ఉన్న మిగిలిన ప్రయాణీకులు రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేశారు. సిబ్బంది వెంటనే స్పందించి ఓ స్టేషన్లో రైలుని ఆపేశారు. 15 మంది ప్రయాణీకులు రైల్వే సిబ్బంది సహాయంతో ఆమెకు డెలివరీ చేశారు. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఆమెకు రైల్వే అధికారులు అభినందనలు తెలియజేసారు. సుఖ ప్రసవం జరగడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ శుభసందర్భంలో ఆమెకు ఓ బహుమతి కూడా ఇచ్చారు. బాబుకి 25 ఏళ్లు వచ్చే వరకు రైల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని పారిస్ మెట్రో ప్రకటించింది. రైల్లో ప్రయాణించేటప్పుడు గర్భిణులు ఎలాంటి ఇబ్బంది పడకుండా సిబ్బంది అప్రమత్తమైన విషయాన్ని అన్ని స్టేషన్లలో డిస్ప్లే చేయించారు రైల్వే అధికారులు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







