పారిస్:ట్రైన్లో పుట్టాడు.. అదృష్టం పట్టేశాడు
- June 20, 2018
పారిస్:ఇక్కడా, అక్కడా పుడితే అదృష్టం వరించదండీ.. ప్యారిస్లో.. అది కూడా అక్కడి ట్రైన్లో పుడితేనే 25 ఏళ్లవరకు ఉచితంగా రైలు ప్రయాణం చేయవచ్చు. ఇది అందరికీ వర్తిస్తుందో లేదో తెలియదు కానీ ఓ బుజ్జాయికి మాత్రం ఇది వర్తింపజేసారు రైలు అధికారులు. అనుకున్న సమయాని రైలు రాలేదు. ఆలస్యంగా వచ్చింది. దాంతో రైలెక్కి ఆసుపత్రికి వెళ్లాలనుకున్న ఓ మహిళ ఆలస్యంగా వచ్చిన రైలెక్కి పురుటి నొప్పులతో ఇబ్బంది పడుతోంది. పక్కనే ఉన్న మిగిలిన ప్రయాణీకులు రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేశారు. సిబ్బంది వెంటనే స్పందించి ఓ స్టేషన్లో రైలుని ఆపేశారు. 15 మంది ప్రయాణీకులు రైల్వే సిబ్బంది సహాయంతో ఆమెకు డెలివరీ చేశారు. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఆమెకు రైల్వే అధికారులు అభినందనలు తెలియజేసారు. సుఖ ప్రసవం జరగడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ శుభసందర్భంలో ఆమెకు ఓ బహుమతి కూడా ఇచ్చారు. బాబుకి 25 ఏళ్లు వచ్చే వరకు రైల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని పారిస్ మెట్రో ప్రకటించింది. రైల్లో ప్రయాణించేటప్పుడు గర్భిణులు ఎలాంటి ఇబ్బంది పడకుండా సిబ్బంది అప్రమత్తమైన విషయాన్ని అన్ని స్టేషన్లలో డిస్ప్లే చేయించారు రైల్వే అధికారులు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







