ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగా కార్యక్రమంలో పాల్గొన్నమోడీ
- June 20, 2018
డెహ్రాడూన్:నేడు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా డెహ్రాడూన్ లో నిర్వహిస్తున్న యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ కార్యక్రమంలో 55 వేలమంది పాల్గొన్నారు. అక్కడి ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. యోగా అనేది కేవలం వ్యాయామం కాదని, అది మనకు మన ప్రాచీన భారతీయులు అందించిన బహుమతి అని అన్నారు మోడీ. యోగా అనేది అన్ని పనులపై ఏకాగ్రతను పెంచడమే కాకుండా కుటుంబంలో, సమాజంలో సద్భావనను కల్పిస్తుందని అన్నారు.
యోగా అతితక్కువ సమయంలోనే ప్రపంచంలోని నలుమూలలా వ్యాప్తి చెందుతోందని అన్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో యోగాను కూడా ఓ భాగంగా చేర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. యోగ సాధనతోనే శాంతి, ఆరోగ్యం, సంతోషం ప్రాప్తిస్తాయని, అందుకే ప్రపంచదేశాలు యోగాను పాటిస్తున్నాయని ఆయన అన్నారు.
ఇక హైదరాబాద్ లో కూడా ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో ఆయుష్ శాఖా భారీ యోగా కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తోంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







