ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగా కార్యక్రమంలో పాల్గొన్నమోడీ
- June 20, 2018డెహ్రాడూన్:నేడు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా డెహ్రాడూన్ లో నిర్వహిస్తున్న యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ కార్యక్రమంలో 55 వేలమంది పాల్గొన్నారు. అక్కడి ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. యోగా అనేది కేవలం వ్యాయామం కాదని, అది మనకు మన ప్రాచీన భారతీయులు అందించిన బహుమతి అని అన్నారు మోడీ. యోగా అనేది అన్ని పనులపై ఏకాగ్రతను పెంచడమే కాకుండా కుటుంబంలో, సమాజంలో సద్భావనను కల్పిస్తుందని అన్నారు.
యోగా అతితక్కువ సమయంలోనే ప్రపంచంలోని నలుమూలలా వ్యాప్తి చెందుతోందని అన్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో యోగాను కూడా ఓ భాగంగా చేర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. యోగ సాధనతోనే శాంతి, ఆరోగ్యం, సంతోషం ప్రాప్తిస్తాయని, అందుకే ప్రపంచదేశాలు యోగాను పాటిస్తున్నాయని ఆయన అన్నారు.
ఇక హైదరాబాద్ లో కూడా ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో ఆయుష్ శాఖా భారీ యోగా కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తోంది.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్