ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగా కార్యక్రమంలో పాల్గొన్నమోడీ
- June 20, 2018
డెహ్రాడూన్:నేడు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా డెహ్రాడూన్ లో నిర్వహిస్తున్న యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ కార్యక్రమంలో 55 వేలమంది పాల్గొన్నారు. అక్కడి ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. యోగా అనేది కేవలం వ్యాయామం కాదని, అది మనకు మన ప్రాచీన భారతీయులు అందించిన బహుమతి అని అన్నారు మోడీ. యోగా అనేది అన్ని పనులపై ఏకాగ్రతను పెంచడమే కాకుండా కుటుంబంలో, సమాజంలో సద్భావనను కల్పిస్తుందని అన్నారు.
యోగా అతితక్కువ సమయంలోనే ప్రపంచంలోని నలుమూలలా వ్యాప్తి చెందుతోందని అన్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో యోగాను కూడా ఓ భాగంగా చేర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. యోగ సాధనతోనే శాంతి, ఆరోగ్యం, సంతోషం ప్రాప్తిస్తాయని, అందుకే ప్రపంచదేశాలు యోగాను పాటిస్తున్నాయని ఆయన అన్నారు.
ఇక హైదరాబాద్ లో కూడా ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో ఆయుష్ శాఖా భారీ యోగా కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తోంది.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







