ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగా కార్యక్రమంలో పాల్గొన్నమోడీ
- June 20, 2018
డెహ్రాడూన్:నేడు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా డెహ్రాడూన్ లో నిర్వహిస్తున్న యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ కార్యక్రమంలో 55 వేలమంది పాల్గొన్నారు. అక్కడి ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. యోగా అనేది కేవలం వ్యాయామం కాదని, అది మనకు మన ప్రాచీన భారతీయులు అందించిన బహుమతి అని అన్నారు మోడీ. యోగా అనేది అన్ని పనులపై ఏకాగ్రతను పెంచడమే కాకుండా కుటుంబంలో, సమాజంలో సద్భావనను కల్పిస్తుందని అన్నారు.
యోగా అతితక్కువ సమయంలోనే ప్రపంచంలోని నలుమూలలా వ్యాప్తి చెందుతోందని అన్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో యోగాను కూడా ఓ భాగంగా చేర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. యోగ సాధనతోనే శాంతి, ఆరోగ్యం, సంతోషం ప్రాప్తిస్తాయని, అందుకే ప్రపంచదేశాలు యోగాను పాటిస్తున్నాయని ఆయన అన్నారు.
ఇక హైదరాబాద్ లో కూడా ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో ఆయుష్ శాఖా భారీ యోగా కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తోంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









