కేంద్ర బృందాలు చంద్రబాబుతో భేటీ..
- December 10, 2015
ఆంధ్రప్రదేశ్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర అధికారుల బృందాలు పర్యటించాయి. కేంద్రం నుంచి వచ్చిన అధికారులు రెండు బృందాలుగా విడిపోయారు. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో రెండు రోజులు పర్యటించాయి. కేంద్ర అధికారులు వరద నష్టాన్ని అంచనావేశారు. నెల్లూరు జిల్లాలోని కావలి, నెల్లూరు, గూడూరు, సూళ్లూరుపేట ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని పరిశీలించారు. వరదలతో నెల్లూరు జిల్లాలకు 2,250 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఏపీ మున్సిపల్ మంత్రి నారాయణ చెబుతున్నారు. చిత్తూరు జిల్లాలోని నగరి, పుత్తూరు, తిరుపతిలో కేంద్ర బృందం పర్యటించింది. భారీ వర్షాలు, వరదలతో జరిగిన నష్టాన్ని అంచనావేసింది. కడప జిల్లాల్లో కూడా కేంద్ర అధికారుల బృందం పర్యటించి, వదరనష్టాన్ని అంచనావేసింది. ఇవాళి విజయవాడలో చంద్రబాబుతో భేటీ అయ్యే కేంద్ర బృందాలు ఢిల్లీ వెళ్లిన తర్వాత హోం శాఖకు నివేదిక ఇస్తాయి.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









