కేంద్ర బృందాలు చంద్రబాబుతో భేటీ..
- December 10, 2015
ఆంధ్రప్రదేశ్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర అధికారుల బృందాలు పర్యటించాయి. కేంద్రం నుంచి వచ్చిన అధికారులు రెండు బృందాలుగా విడిపోయారు. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో రెండు రోజులు పర్యటించాయి. కేంద్ర అధికారులు వరద నష్టాన్ని అంచనావేశారు. నెల్లూరు జిల్లాలోని కావలి, నెల్లూరు, గూడూరు, సూళ్లూరుపేట ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని పరిశీలించారు. వరదలతో నెల్లూరు జిల్లాలకు 2,250 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఏపీ మున్సిపల్ మంత్రి నారాయణ చెబుతున్నారు. చిత్తూరు జిల్లాలోని నగరి, పుత్తూరు, తిరుపతిలో కేంద్ర బృందం పర్యటించింది. భారీ వర్షాలు, వరదలతో జరిగిన నష్టాన్ని అంచనావేసింది. కడప జిల్లాల్లో కూడా కేంద్ర అధికారుల బృందం పర్యటించి, వదరనష్టాన్ని అంచనావేసింది. ఇవాళి విజయవాడలో చంద్రబాబుతో భేటీ అయ్యే కేంద్ర బృందాలు ఢిల్లీ వెళ్లిన తర్వాత హోం శాఖకు నివేదిక ఇస్తాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







