కేంద్ర బృందాలు చంద్రబాబుతో భేటీ..

- December 10, 2015 , by Maagulf
కేంద్ర బృందాలు చంద్రబాబుతో భేటీ..

ఆంధ్రప్రదేశ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర అధికారుల బృందాలు పర్యటించాయి. కేంద్రం నుంచి వచ్చిన అధికారులు రెండు బృందాలుగా విడిపోయారు. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో రెండు రోజులు పర్యటించాయి. కేంద్ర అధికారులు వరద నష్టాన్ని అంచనావేశారు. నెల్లూరు జిల్లాలోని కావలి, నెల్లూరు, గూడూరు, సూళ్లూరుపేట ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని పరిశీలించారు. వరదలతో నెల్లూరు జిల్లాలకు 2,250 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఏపీ మున్సిపల్‌ మంత్రి నారాయణ చెబుతున్నారు. చిత్తూరు జిల్లాలోని నగరి, పుత్తూరు, తిరుపతిలో కేంద్ర బృందం పర్యటించింది. భారీ వర్షాలు, వరదలతో జరిగిన నష్టాన్ని అంచనావేసింది. కడప జిల్లాల్లో కూడా కేంద్ర అధికారుల బృందం పర్యటించి, వదరనష్టాన్ని అంచనావేసింది. ఇవాళి విజయవాడలో చంద్రబాబుతో భేటీ అయ్యే కేంద్ర బృందాలు ఢిల్లీ వెళ్లిన తర్వాత హోం శాఖకు నివేదిక ఇస్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com