ఫేస్బుక్ యూజర్లకు శుభవార్త.
- December 11, 2015
ఫేస్బుక్ యూజర్లకు శుభవార్త. ఇక నుంచి ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో లేకున్నా ఫేస్బుక్ను చూడొచ్చు. ఫేస్బుక్లోని పోస్టులపై కామెంట్లూ పెట్టొచ్చు. ఈ మేరకు తమ వెబ్సైట్ను ప్రజలకు మరింతగా అందుబాటులోకి తేవడానికి చర్యలు తీసుకుంటున్నట్టు సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ఫేస్బుక్ ప్రకటించింది. ఇంటర్నెట్ కనెక్షన్ నెమ్మదిగా ఉన్నా న్యూస్ఫీడ్ను అందుబాటులో ఉంచేలా చూడనున్నట్టు తెలిపింది. భారత్ వంటి వర్ధమాన మార్కెట్లలో మొబైల్ ద్వారా 2జీ నెట్వర్క్ను ఉపయోగించుకొని ఫేస్బుక్ను చూసే యూజర్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నది. ఈ విషయాన్ని గుర్తించిన ఆ సంస్థ ఆ యూజర్లకు మరింత అందుబాటులో ఉండేలా కొత్త అప్డేట్ను ప్రస్తుతం పరీక్షిస్తుంది. దీనిప్రకారం ఇంటర్నెట్ అందుబాటులో ఉన్నప్పుడు ఫోన్లో డౌన్లోడ్ అయిన ఫేస్బుక్ స్టోరీలను తర్వాత కూడా చూడవచ్చు. యూజర్ల రెలెవెన్స్ ఆధారంగా న్యూస్ఫీడ్లో ఈ స్టోరీలు కనబడతాయి. అదేవిధంగా మెరుగైన నెట్ కనెక్షన్ ఉన్నప్పుడు రోజంతా ఎప్పటికప్పుడు కొత్త పోస్టులు న్యూస్ఫీడ్లోకి వచ్చేలా మెరుగులు దిద్దుతున్నది. ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా ఫేస్బుక్లోని పోస్టులపై కామెంట్లుపెట్టడం ఇప్పుడు సాధ్యమేనని, నెట్ కనెక్షన్ అందుబాటులోకి రాగానే కామెంట్లు ఆటోమేటిక్గా అప్లోడ్ అవుతాయని తెలిపింది. ఎప్పటికప్పుడు యూజర్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునేలా రూపొందించిన సరికొత్త న్యూస్ఫీడ్ ఫీచర్స్ ఫేస్బుక్ ప్రస్తుతం పరీక్షిస్తున్నది
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







