మిసెస్ ఇండియా ఫైనలిస్ట్ హత్య కేసులో సంచలన విషయాలు..
- June 25, 2018
మేజర్ అమిత్ ద్వివేది భార్య మిసెస్ ఇండియా ఎర్త్ ఫైనలిస్ట్ శైలజ ద్వివేది..మేజర్ నిఖిల్ రాయ్ హండా చేతిలో శనివారం దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఆమెను మేజర్ నిఖిల్ హండా గొంతు కోసి హత్య చేసినట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. తనను పేళ్ళి చేసుకోవాలని శైలజను నిఖిల్ కోరగా ఆమె అంగీకరించకపోవడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడని తెలిపారు. హండాకు శైలజతో గత కొంత కాలంగా వివాహేతర సంబంధం ఉందని పోలీసులు పేర్కొన్నారు. శైలజ భర్త మేజర్గా నాగపూర్లో విధులు నిర్వహిస్తుండగా సహచర మేజర్ అమిత్ ద్వివేది భార్య శైలజతో నిఖిల్కు పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం క్రమంగా వివహేతర సంబంధానికి దారితీసింది. వీరి బంధం శైలజ భర్త అమిత్కు తేలిసిపోవడంతో ఈ బంధాన్ని తెంచుకోవాలంటూ ఇద్దరినీ హెచ్చరించాడు.భర్త హెచ్చరికతో శైలజ ఇకపై నిఖిల్ను కలవొద్దని నిర్ణయించుకొని అమిత్కు ఢీల్లీకి బదిలి అవడంతో అతనితో కలిసి ఢిల్లీకి వచ్చేసింది.కానీ నిఖిల్ అమిత్ హెచ్చరికను ఖాతరు చేయలేదు. శైలజను కలవడానాకి ప్రయత్నిస్తుండేవాడు. శనివారం ఆమెను కలిసి కారులో ఎక్కుంచుకొని వేళ్ళాడు. కారులో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో హండా కత్తితో శైలజ గొంతును కోశాడు. వీరిద్దరూ అరు నెలలో దాదాపు 3300 కాల్స్ మాట్లాడుకునట్టు పోలీసులు గుర్తించారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







