మిసెస్ ఇండియా ఫైనలిస్ట్ హత్య కేసులో సంచలన విషయాలు..
- June 25, 2018
మేజర్ అమిత్ ద్వివేది భార్య మిసెస్ ఇండియా ఎర్త్ ఫైనలిస్ట్ శైలజ ద్వివేది..మేజర్ నిఖిల్ రాయ్ హండా చేతిలో శనివారం దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఆమెను మేజర్ నిఖిల్ హండా గొంతు కోసి హత్య చేసినట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. తనను పేళ్ళి చేసుకోవాలని శైలజను నిఖిల్ కోరగా ఆమె అంగీకరించకపోవడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడని తెలిపారు. హండాకు శైలజతో గత కొంత కాలంగా వివాహేతర సంబంధం ఉందని పోలీసులు పేర్కొన్నారు. శైలజ భర్త మేజర్గా నాగపూర్లో విధులు నిర్వహిస్తుండగా సహచర మేజర్ అమిత్ ద్వివేది భార్య శైలజతో నిఖిల్కు పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం క్రమంగా వివహేతర సంబంధానికి దారితీసింది. వీరి బంధం శైలజ భర్త అమిత్కు తేలిసిపోవడంతో ఈ బంధాన్ని తెంచుకోవాలంటూ ఇద్దరినీ హెచ్చరించాడు.భర్త హెచ్చరికతో శైలజ ఇకపై నిఖిల్ను కలవొద్దని నిర్ణయించుకొని అమిత్కు ఢీల్లీకి బదిలి అవడంతో అతనితో కలిసి ఢిల్లీకి వచ్చేసింది.కానీ నిఖిల్ అమిత్ హెచ్చరికను ఖాతరు చేయలేదు. శైలజను కలవడానాకి ప్రయత్నిస్తుండేవాడు. శనివారం ఆమెను కలిసి కారులో ఎక్కుంచుకొని వేళ్ళాడు. కారులో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో హండా కత్తితో శైలజ గొంతును కోశాడు. వీరిద్దరూ అరు నెలలో దాదాపు 3300 కాల్స్ మాట్లాడుకునట్టు పోలీసులు గుర్తించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..