మసాజ్ పార్లర్ వద్ద ఐదుగురి హత్య
- June 26, 2018
అబుదాబీలోని ఓ మసాజ్ పార్లర్ వద్ద ఓ వ్యక్తి ఐదుగుర్ని హత్య చేశాడు. తన గర్ల్ఫ్రెండ్తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న కారణంతోనే ఓ వ్యక్తిని హత్య చేసిన నిందితుడు, ఆ తర్వాత పార్లర్ వద్ద వున్న మరో నలుగురు మహిళల్నీ హత్య చేశాడు. ముసాఫ్ఫా ఇండస్ట్రియల్ ఏరియా వద్ద ఈ పార్లర్ వుంది. ప్రాస్టిట్యూషన్ డెన్గా ఈ పార్లర్ పేరొందింది. ఈ ఏడాది ప్రారంభంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అబుదాబీ క్రిమినల్ కోర్టులో జరిగిన విచారణలో బంగ్లాదేశీ వ్యక్తి, కిచెన్ నైఫ్తో ఈ హత్యలకు పాల్పడినట్లు నిర్ధారించారు. ఆసియాకి చెందిన వ్యక్తి ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడి ప్రియురాల్ని ఇండోనేసియన్గా గుర్తించారు. ఈ ఘటన గురించి తెలిసిన నిందితుడి స్నేహితులు, నిందితుడ్ని కాపాడే క్రమంలో ఘటనను దాచిపెట్టారు. అయితే, కొందరు వ్యక్తులు మృతదేహాల్ని గుర్తించి, పోలీసులకు సమాచారం అందించడంతో విచారణ చేపట్టిన పోలీసులు, నిందితుడ్ని, అతని గర్ల్ఫ్రెండ్నీ అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు, నేరాన్ని అంగీకరించాడు. తదుపరి విచారణ సెప్టెంబర్ 26కి వాయిదా పడింది.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు మరో అంతర్జాతీయ అవార్డు
- దమ్మామ్–రియాద్ ఎక్స్ప్రెస్వే విస్తరణకు శ్రీకారం..
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్







