మసాజ్ పార్లర్ వద్ద ఐదుగురి హత్య
- June 26, 2018
అబుదాబీలోని ఓ మసాజ్ పార్లర్ వద్ద ఓ వ్యక్తి ఐదుగుర్ని హత్య చేశాడు. తన గర్ల్ఫ్రెండ్తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న కారణంతోనే ఓ వ్యక్తిని హత్య చేసిన నిందితుడు, ఆ తర్వాత పార్లర్ వద్ద వున్న మరో నలుగురు మహిళల్నీ హత్య చేశాడు. ముసాఫ్ఫా ఇండస్ట్రియల్ ఏరియా వద్ద ఈ పార్లర్ వుంది. ప్రాస్టిట్యూషన్ డెన్గా ఈ పార్లర్ పేరొందింది. ఈ ఏడాది ప్రారంభంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అబుదాబీ క్రిమినల్ కోర్టులో జరిగిన విచారణలో బంగ్లాదేశీ వ్యక్తి, కిచెన్ నైఫ్తో ఈ హత్యలకు పాల్పడినట్లు నిర్ధారించారు. ఆసియాకి చెందిన వ్యక్తి ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. నిందితుడి ప్రియురాల్ని ఇండోనేసియన్గా గుర్తించారు. ఈ ఘటన గురించి తెలిసిన నిందితుడి స్నేహితులు, నిందితుడ్ని కాపాడే క్రమంలో ఘటనను దాచిపెట్టారు. అయితే, కొందరు వ్యక్తులు మృతదేహాల్ని గుర్తించి, పోలీసులకు సమాచారం అందించడంతో విచారణ చేపట్టిన పోలీసులు, నిందితుడ్ని, అతని గర్ల్ఫ్రెండ్నీ అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు, నేరాన్ని అంగీకరించాడు. తదుపరి విచారణ సెప్టెంబర్ 26కి వాయిదా పడింది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









