బాబు గోగినేనిపై కేసు నమోదు.. ఆధారాలు ఇవ్వలేదన్న సీఐ..
- June 26, 2018హేతువాది బాబు గోగినేనిపై హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో ఓ మతాన్ని కించ పరిచేలా మాట్లాడారని కేవీ నారాయణ కోర్టును ఆశ్రయించారు. అలాగే ప్రైవేట్ కార్యక్రమానికి ఆధార్ నంబర్లను తీసుకోవడం పైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
బాబు గోగినేని సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ పేరుతో ఇటీవల హైదరాబాద్, విశాఖ, బెంగళూరులో సమావేశాలు నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి వచ్చిన వారి నుంచి ఆధార్ నెంబర్లు తీసుకున్నారు. వీటిని మలేషియా కంపెనీకి విక్రయించినట్టు కేవీ నారాయణ ఆరోపించారు. అలాగే సోషల్ మీడియాలో సౌదీ ఉగ్రవాద దేశమని బాబు గోగినేని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లతో ఆ దేశానికి, మనకు మధ్య సత్ సంబంధాలు దెబ్బతింటాయని పిటిషనర్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో హిందూ మత గ్రంథాలను బాబు గోగినేని కించపరిచారని పిటిషనర్ పేర్కోన్నారు. దీంతో మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో బాబు గోగినేని పై 13 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
ఐతే.. తమకు ఫిర్యాదు చేసిన కేవీ నారాయణ ఇంకా పూర్తి ఆధారాలు తమకు ఇవ్వలేదని.. మాదాపూర్ పీఎస్ సీఐ కళింగరావు చెప్పారు. ఆధారాలు సమర్పించాక బాబు గోగినేనిపై చర్యలు తీసుకుంటామన్నారు కళింగరావు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా