కోలీవుడ్ లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన 'మిస్ ఇండియా'

- June 26, 2018 , by Maagulf
కోలీవుడ్ లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన 'మిస్ ఇండియా'

అందాల పోటీలు, మోడలింగ్‌ రంగాలు వెండితెరకు మధ్య  వారధిగా మారుతున్నాయి. అందాలపోటీల్లో కిరీటాలను గెలుచుకుని, మోడలింగ్‌ రంగంలో రాణిస్తూ సినీ కథానాయకీలుగా ప్రమోట్‌ అవుతున్నారు కొందరు నటీమణులు. ఇటీవల ఆ జాబితాలో చేరారు బెంగాలీ బ్యూటీ ఉపాసన. 2015లో ఆల్‌ ఇండియా అందాల పోటీల్లో పాల్గొని మిస్‌ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్నారు ఉపాసన. దాదాపు 100 వాణిజ్య ప్రకటనల్లో నటించిన ఆమె. విజయ్‌ టీవీలో ప్రసారం అయిన 'విల్లా టూ విలేజ్‌' కార్యక్రమంతో మంచి గుర్తింపు సంపాదించారు. ఆ తరువాత సినిమా రంగం వైపు మళ్ళీ ఈ మధ్యనే '88' చిత్రం ద్వారా కోలీవుడ్‌కు హీరోయిన్ గా రంగప్రవేశం చేసింది. కానీ '88' అంతకన్నా ముందే ఉపాసన 'ట్రాఫిక్‌ రామస్వామి' లో నటించింది. ఎపుడైనా.. ఎక్కడైనా.. తనకు ఇష్టమైన సినిమా గురించి చెప్పమంటే 'ట్రాఫిక్‌ రామస్వామి' అనే చెబుతుందట. ప్రస్తుతం అడపా దడపా సినిమాలు చేస్తూ మోడలింగ్ వృత్తిని మాత్రం వదులుకోను అని చెబుతున్నారు.అవకాశమొస్తే బాలీవుడ్ లో కూడా నటించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com