కోలుకుంటున్న కెప్టెన్ రాజు: త్వరలో డిశ్చార్జ్
- June 28, 2018
మస్కట్: సినీ నటుడు కెప్టెన్ రాజు, దర్సయిత్లోని కేరళ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్)లో కోలుకుంటున్నారు. మంగళవారం ఆయన్ని ఆసుపత్రిలో చేర్చారు. అమెరికా వెళుతుండగా, మార్గమధ్యంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. దాంతో మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని ఎమర్జన్సీ ల్యాండింగ్ చేశారు. హుటాహుటిన కెప్టెన్ రాజుని ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఆయన వైద్య చికిత్స పొందుతున్నారు. శనివారం నాటికి ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందనీ, అదే రోజు ఆయన్ని స్వదేశానికి పంపే ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వైద్యులు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. కిమ్స్ ఆసుపత్రి ప్రతినిథి మాట్లాడుతూ, కెప్టెన్ రాజు వయసు 68 ఏళ్ళనీ, ఈ వయసులో స్ట్రోక్ రావడం వింతేమీ కాదని చెబుతూ, తగిన వైద్యం అందించామనీ, ప్రస్తుతం కోలుకున్నారని చెప్పారు. కెప్టెనన రాజు వెంట ఆయన భార్య ఆసుపత్రిలోనే వున్నారు. తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ సినిమాల్లో ఆయన పలు సినిమాల్లో నటించారు. గతంలో ఆయన మిలిటరీ అధికారిగా భారతదేశంలో సేవలందించారు.
తాజా వార్తలు
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!
- కింగ్ ఫైసల్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- యూఏఈ ట్రావెల్.. ఏ వస్తువులు తీసుకెళ్లవచ్చు? వేటిపై నిషేధం ఉందంటే?
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు







