కోలుకుంటున్న కెప్టెన్ రాజు: త్వరలో డిశ్చార్జ్
- June 28, 2018
మస్కట్: సినీ నటుడు కెప్టెన్ రాజు, దర్సయిత్లోని కేరళ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్)లో కోలుకుంటున్నారు. మంగళవారం ఆయన్ని ఆసుపత్రిలో చేర్చారు. అమెరికా వెళుతుండగా, మార్గమధ్యంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. దాంతో మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని ఎమర్జన్సీ ల్యాండింగ్ చేశారు. హుటాహుటిన కెప్టెన్ రాజుని ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఆయన వైద్య చికిత్స పొందుతున్నారు. శనివారం నాటికి ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందనీ, అదే రోజు ఆయన్ని స్వదేశానికి పంపే ఏర్పాట్లు చేయనున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వైద్యులు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. కిమ్స్ ఆసుపత్రి ప్రతినిథి మాట్లాడుతూ, కెప్టెన్ రాజు వయసు 68 ఏళ్ళనీ, ఈ వయసులో స్ట్రోక్ రావడం వింతేమీ కాదని చెబుతూ, తగిన వైద్యం అందించామనీ, ప్రస్తుతం కోలుకున్నారని చెప్పారు. కెప్టెనన రాజు వెంట ఆయన భార్య ఆసుపత్రిలోనే వున్నారు. తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ సినిమాల్లో ఆయన పలు సినిమాల్లో నటించారు. గతంలో ఆయన మిలిటరీ అధికారిగా భారతదేశంలో సేవలందించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







