గల్ఫ్ లో ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులకు అండగా ఏపీఎన్ఆర్టీ
- June 28, 2018
గల్ఫ్ దేశాల్లో తలెత్తిన ఆర్థిక మాంద్యం ప్రవాసాంధ్రులపై ప్రభావం చూపిస్తోంది. ఖర్చుల నియంత్రణ, ఉద్యోగుల జాతీయకరణ, వీసా నిబంధనలతో వాళ్లంతా ఇప్పుడు స్వదేశానికి తిరుగుముఖం పట్టారు. ఉపాధి కోల్పోయి మాతృభూమికి చేరుకుంటున్న వారి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వారి నైపుణ్యాన్ని సానబెట్టి దేశీయ మౌలిక రంగ ప్రాజెక్టుల్లో ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఏపీఎన్ఆర్టీ సొసైటీ సాయంతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. రోజురోజుకు పెరుగుతున్న ఆర్థిక మాంద్యం విదేశాల్లో తెలుగు వాళ్ల ఉద్యోగాలకు, ఉపాధికి ఎసరు తెస్తోంది. దీంతో ఏడాది నుంచి రాష్ట్రానికి తిరిగివస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఆయా దేశాల్లో మారిన వీసా నిబంధనలు, ఉద్యోగాల జాతీయకరణ.. కువైట్, ఒమన్, ఖతర్, బెహ్రయిన్ దేశాల నుంచి వెనక్కి వచ్చేలా చేస్తున్నాయి. ప్రత్యేకించి ఏడారి దేశాల్లో నిర్మాణ రంగ ప్రాజెక్టులు నిలిచిపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. కొత్త నిబంధనలు ప్రవేశ పెట్టి వ్యయం తగ్గించుకునేందుకు గల్ఫ్ దేశాలు ప్రయత్నిస్తున్నాయి.
దీనిలో భాగంగా భారీస్థాయిలో ఉద్యోగుల తొలగింపు చేపట్టాయి. వీరిలో ఏపీ, తెలంగాణకు చెందిన వారే అధిక సంఖ్యలో ఉంటున్నారు. ఇలాంటి వారి కోసం ఏపీ సర్కారు ప్రత్యేక విధానం ప్రవేశ పెట్టింది. వారందరికి శిక్షణ ఇచ్చి దేశీయ ప్రాజెక్టుల్లో వినియోగించుకోనుంది. ఇందుకోసం విశాఖ, తిరుపతి, కర్నూలు, అమరావతిలో ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఎన్ఆర్టీ చేస్తున్న కృషిని కార్మికుల కుటుంబ సభ్యులు, బంధువులు అభినందిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







