'సవ్యసాచి' ని వెనక్కి నెట్టిన నాగ్
- July 07, 2018
ప్రస్తుతం నాగ చైతన్య రెండు సినిమాలతో మన ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. చందూ మొండేటి డైరెక్షన్ లో 'సవ్యసాచి' అనే ఒక సినిమా, ఇంకోటి మారుతీ డైరెక్షన్ 'శైలజా రెడ్డి అల్లుడు'. ఈ రెండు సినిమాలు వచ్చే నెలలోనే రిలీజ్ అవుతున్నాయి అని గత కొన్ని రోజుల నుండి వార్తలు వస్తున్నాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం 'సవ్యసాచి' విడుదల వాయిదా పడినట్లుగా సమాచారం వస్తుంది. గ్రాఫిక్స్ పనుల కారణంగా ఆగష్టు రెండవ వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు చిత్ర నిర్మాతలు. అదే నెల 31న చైతు ఇంకో సినిమా 'శైలజా రెడ్డి అల్లుడు' కూడా రిలీజ్ ఉండటంతో..'సవ్యసాచి' ని వాయిదా వేయమని కోరారట నాగార్జున. అందుకు ఆ చిత్ర సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కూడా అంగీకరించినట్టు తెలుస్తుంది. మరి సెప్టెంబర్ లో నాగ్, నానిలు నటిస్తున్న'దేవదాస్ 'చిత్రం ఉంది. సెప్టెంబర్ విడుదలకు నాగ్ ఒప్పుకుంటాడో లేదో చూడాలి. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు.
సో ఈ సినిమాపై క్లారిటీ వస్తే 'సవ్యసాచి' పై క్లారిటీ వస్తుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!