'సవ్యసాచి' ని వెనక్కి నెట్టిన నాగ్
- July 07, 2018
ప్రస్తుతం నాగ చైతన్య రెండు సినిమాలతో మన ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. చందూ మొండేటి డైరెక్షన్ లో 'సవ్యసాచి' అనే ఒక సినిమా, ఇంకోటి మారుతీ డైరెక్షన్ 'శైలజా రెడ్డి అల్లుడు'. ఈ రెండు సినిమాలు వచ్చే నెలలోనే రిలీజ్ అవుతున్నాయి అని గత కొన్ని రోజుల నుండి వార్తలు వస్తున్నాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం 'సవ్యసాచి' విడుదల వాయిదా పడినట్లుగా సమాచారం వస్తుంది. గ్రాఫిక్స్ పనుల కారణంగా ఆగష్టు రెండవ వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు చిత్ర నిర్మాతలు. అదే నెల 31న చైతు ఇంకో సినిమా 'శైలజా రెడ్డి అల్లుడు' కూడా రిలీజ్ ఉండటంతో..'సవ్యసాచి' ని వాయిదా వేయమని కోరారట నాగార్జున. అందుకు ఆ చిత్ర సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కూడా అంగీకరించినట్టు తెలుస్తుంది. మరి సెప్టెంబర్ లో నాగ్, నానిలు నటిస్తున్న'దేవదాస్ 'చిత్రం ఉంది. సెప్టెంబర్ విడుదలకు నాగ్ ఒప్పుకుంటాడో లేదో చూడాలి. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు.
సో ఈ సినిమాపై క్లారిటీ వస్తే 'సవ్యసాచి' పై క్లారిటీ వస్తుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







