తప్పును సరిదిద్దుకున్నఇరాన్..భారత్ తలొగ్గుతోందంటూ..
- July 12, 2018
అమెరికా ఒత్తిళ్లకు భారత్ తలొగ్గుతోందని ఇరాన్ ఆరోపణలు చేసింది. చమురు దిగుమతిని తగ్గించుకుంటే ప్రత్యేక హక్కులు కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించిన మరుసటి రోజే తన వాదనను వెనక్కు తీసుకుంది. ట్రంప్ ఆంక్షలతో భారత్ సహా చాలా దేశాలు ప్రభావితమవుతున్నాయని భారత్లో ఇరాన్ రాయబార కార్యాలయం వెల్లడించింది. ఇరాన్ నుంచి చమురు దిగుమతులను పూర్తిగా తగ్గించుకోవాలని భారత్ సహా పలు దేశాలను అమెరికా ఆదేశించింది. నవంబర్ 4 నాటికి చమురు దిగుమతులు జీరో అవ్వాలని, లేకపోతే పలు ఆంక్షలు తప్పవని హెచ్చరికలు చేసింది. దీంతో ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతి విషయంలో భారత్ ఆచితూచి వ్యవహరిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇరాన్ రాయబారి భారత్పై అసహనం వ్యక్తం చేశారు. అయితే తాజాగా తన తప్పును సరిదిద్దుకున్నారు. భారత్కు చమురు దిగుమతి విషయంలో తమ వంతు పాత్రను బాధ్యతగా వ్యవహరిస్తామని చెప్పారు. భారత్తో తమకు ఎప్పుడూ మంచి బంధాలే ఉన్నాయని ఇరాన్ రాయబారి క్లారిటీ ఇచ్చారు.
తాజా వార్తలు
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
- DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
- సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!







