'యాత్ర' కు మాట ఇచ్చిన ప్రభాస్!
- July 12, 2018
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి వైఎస్ఆర్ పాత్రలో నటిస్తున్నారు. కేవలం ఒకే షెడ్యూల్ లో ఈ చిత్ర షూటింగ్ ముగియనుంది.వైఎస్ఆర్ రాజకీయ జీవితంలో చోటుచేసుకున్న కీలక ఘట్టాలని ఈ చిత్రంలో చూపించబోతున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర, ముఖ్యమంత్రిగా ఆయన అందించిన పాలన వంటి విషయాలు ఈ చిత్రంలో చూపించబోతున్నారు. తాజగా ఈ చిత్రం కోసం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సహకారం అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ చిత్ర నిర్మాత విజయ్ చల్లా, ప్రభాస్ మంచి స్నేహితులు. దీనితో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలలో సహకారం అందిస్తామని విజయ్ కు ప్రభాస్ మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నాటికీ వైఎస్ఆర్ బయోపిక్ పూర్తి కానుంది. యాత్ర అనే టైటిల్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







