మానవ అవయవాల వ్యాపారం..37 మందికి జైలుశిక్ష
- July 13, 2018
కైరో: అక్రమంగా మానవ అవయవాల వ్యాపారంలో భాగస్వామ్యమైన 37మందికి ఈజిప్ట్ కోర్టు జైలుశిక్ష విధించింది. అవయవ వ్యాపారంలో పాల్గొన్నవారికి కైరో క్రిమినల్ కోర్టు మూడేళ్ల నుంచి గరిష్టంగా 15 ఏండ్ల వరకు జైలు శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. నిందితుల్లో ఆరుగురికి 15 ఏండ్లు, 11 మందికి ఏడేళ్లు, 20 మందికి మూడేళ్లు జైలు శిక్ష విధించింది. ఈ కేసులో ముగ్గురిని నిర్దోషులుగా నిర్దారించారు.
డాక్లర్లు, వైద్య విభాగంలో పనిచేసే సిబ్బంది, మధ్యవర్తులు అక్రమ అవయవ మార్పిడి, అవయవాల వాణిజ్య కార్యకలాపాల్లో పాల్గొన్నారని దర్యాప్తులో తేలినట్లు అధికారులు తెలిపారు. పేద ఈజిప్షియన్ల అవసరాన్ని ఆసరాగా చేసుకుని అవయవ వ్యాపారం కొనసాగిస్తున్నట్లు తేలింది. 2010 చట్టం ప్రకారం మావన అవయవాలను అమ్మడం నేరం. అయితే కడుపేదరికం కారణంగా కొందరు ఈజిప్షియన్లు వారి అవయవాలను అమ్ముకుంటున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







