నేటి నుంచి జగన్నాథుని రథయాత్ర

- July 13, 2018 , by Maagulf
నేటి నుంచి జగన్నాథుని రథయాత్ర

పూరి జగన్నాథుడి రథయాత్ర ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది... ప్రధాన దేవస్థానం పూరి శ్రీ మందిరంలో దేవస్థానం, ఒడిశా ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేశాయి. శుక్రవారం సాయంత్రం జగన్నాథుడి ఆలయం నుంచి ఆజ్ఞామాల రథ నిర్మాణ ప్రాంగణానికి చేరడంతో రథాలను మలుపుతిప్పారు. ప్రధాన దేవాలయం నుంచి మూలవిరాట్లను వరుస క్రమంలో రథాలపైకి తరలించడానికి వీలుగా ముందు రోజు రథాలను మలుపు తిప్పడం ఆచారం. నేటి నుంచి జరగనున్న రథయాత్ర ఉత్సవాల కోసం దేశ విదేశాల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో పూరికి చేరుకున్నారు. దర్శనం కోసం ఇప్పటికే భక్తులు బారులు తీరారు. 15 రోజుల అనసరగృహ వేడుక తర్వాత తొలిసారి దేవతామూర్తులు మళ్లీ కొలువు తీరాయి. జగన్నాథుడు, బలభద్రుడు, దేవీ సుభద్ర విగ్రహాలు ఈ వేడుక కోసం ధగధగలాడుతున్నాయి. రథయాత్ర సందర్భంగా పూరిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com