నేటి నుంచి జగన్నాథుని రథయాత్ర
- July 13, 2018పూరి జగన్నాథుడి రథయాత్ర ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది... ప్రధాన దేవస్థానం పూరి శ్రీ మందిరంలో దేవస్థానం, ఒడిశా ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేశాయి. శుక్రవారం సాయంత్రం జగన్నాథుడి ఆలయం నుంచి ఆజ్ఞామాల రథ నిర్మాణ ప్రాంగణానికి చేరడంతో రథాలను మలుపుతిప్పారు. ప్రధాన దేవాలయం నుంచి మూలవిరాట్లను వరుస క్రమంలో రథాలపైకి తరలించడానికి వీలుగా ముందు రోజు రథాలను మలుపు తిప్పడం ఆచారం. నేటి నుంచి జరగనున్న రథయాత్ర ఉత్సవాల కోసం దేశ విదేశాల నుంచి భక్తులు లక్షల సంఖ్యలో పూరికి చేరుకున్నారు. దర్శనం కోసం ఇప్పటికే భక్తులు బారులు తీరారు. 15 రోజుల అనసరగృహ వేడుక తర్వాత తొలిసారి దేవతామూర్తులు మళ్లీ కొలువు తీరాయి. జగన్నాథుడు, బలభద్రుడు, దేవీ సుభద్ర విగ్రహాలు ఈ వేడుక కోసం ధగధగలాడుతున్నాయి. రథయాత్ర సందర్భంగా పూరిలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ