ట్విట్టర్ షాక్ తగిలిన తారలు
- July 14, 2018
ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్.. ఇలా సోషల్ మీడియాలో తమతమ అకౌంట్లకు ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారో ఘనంగా చెప్పుకునే రోజులివి. సినీ స్టార్ల విషయానికొస్తే దీనికి మరింత ప్రాముఖ్యత. అయితే, ఈ విషయంలో బాలీవుడ్ స్టార్ నటీనటులకు తాజాగా పెద్ద షాకే ఇచ్చింది ట్విట్టర్ సంస్థ. ప్రముఖ నటులు అమితాబ్, షారూఖ్, ప్రియాంక చోప్ర, దీపిక పదుకునే వంటి సినీ స్టార్స్ ఫాలోవర్స్ ను భారీగా తగ్గించింది.
ఇటీవల ట్విట్టర్ సంస్థ నకిలీ అకౌంట్లపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. తప్పుడు వివరాలతో అకౌంట్ రన్ చేస్తోన్న ఖాతాదారుల్ని ఏరిపారేస్తోంది. ఇందులో భాగంగా చాలామంది ఖాతాలు గల్లంతయ్యాయి. సినీ స్టార్స్ ను ఫాలో అయ్యే ఇలాంటి నకిలీ గాళ్లంతా పోవడంతో ఆమేరకు ఆయా నటీనటుల ఫాలోవర్ల సంఖ్య తగ్గిపోయింది. ఇలా భారీగా కోతకు గురైన వాళ్లలో అమితాబ్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా, మూడు లక్షల పైచిలుకు ఫాలోవర్లు కోల్పోయిన వాళ్లలో షారూఖ్, ప్రియాంకచోప్రా, దీపికా పదుకునే తదితరులు ఉన్నారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







