ట్విట్టర్ షాక్ తగిలిన తారలు
- July 14, 2018ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్.. ఇలా సోషల్ మీడియాలో తమతమ అకౌంట్లకు ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారో ఘనంగా చెప్పుకునే రోజులివి. సినీ స్టార్ల విషయానికొస్తే దీనికి మరింత ప్రాముఖ్యత. అయితే, ఈ విషయంలో బాలీవుడ్ స్టార్ నటీనటులకు తాజాగా పెద్ద షాకే ఇచ్చింది ట్విట్టర్ సంస్థ. ప్రముఖ నటులు అమితాబ్, షారూఖ్, ప్రియాంక చోప్ర, దీపిక పదుకునే వంటి సినీ స్టార్స్ ఫాలోవర్స్ ను భారీగా తగ్గించింది.
ఇటీవల ట్విట్టర్ సంస్థ నకిలీ అకౌంట్లపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. తప్పుడు వివరాలతో అకౌంట్ రన్ చేస్తోన్న ఖాతాదారుల్ని ఏరిపారేస్తోంది. ఇందులో భాగంగా చాలామంది ఖాతాలు గల్లంతయ్యాయి. సినీ స్టార్స్ ను ఫాలో అయ్యే ఇలాంటి నకిలీ గాళ్లంతా పోవడంతో ఆమేరకు ఆయా నటీనటుల ఫాలోవర్ల సంఖ్య తగ్గిపోయింది. ఇలా భారీగా కోతకు గురైన వాళ్లలో అమితాబ్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా, మూడు లక్షల పైచిలుకు ఫాలోవర్లు కోల్పోయిన వాళ్లలో షారూఖ్, ప్రియాంకచోప్రా, దీపికా పదుకునే తదితరులు ఉన్నారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..