హైదరాబాద్లో ఘరానా మోసం..
- July 16, 2018హైదరాబాద్లో మరో ఘరానామోసం వెలుగుచూసింది. కరక్కాయల్ని పొడి కొట్టిస్తే.. వేలకు వేలు ఆదాయం వస్తుందంటూ మోసగాళ్లు గాలం వేశారు. కేజీకి 300 రూపాయలు ఇస్తామని నమ్మించారు. అయితే.. కరక్కాయలు మాత్రం తమ దగ్గరే కొనాలని మెలిక పెట్టారు. కేజీ కరక్కాయలు వెయ్యి రూపాయలు పెట్టి కొంటే.. పొడి కొట్టినందుకు 300 వస్తాయని ఊరించడంతో అమాయకులు ఎగబడ్డారు.
కరక్కాయల పొడి పేరుతో ఏకంగా 5 కోట్ల రూపాయలకు కుచ్చుటోపి పెట్టింది సాఫ్ట్ ఇంటిగ్రేట్ మల్టి టూల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ. యూట్యూబ్ ఛానల్, యాప్, పేపర్లలో ప్రకటనలు గుప్పించారు. వెయ్యి పెట్టుబడికి 300 లాభం అంటూ ఊరించారు. ఒక్కొక్కరి నుంచి ఆర్డర్ పేరుతో లక్షలు కట్టించుకుని.. బోర్డు తిప్పేశారు.
కరక్కాయ పొడికి మోసపోయామని గ్రహించిన బాధితులు కూకట్పల్లి హోసింగ్ బోర్డులోని ఆఫీస్కు వెళ్లారు. అక్కడి సిబ్బందిని పోలీసులకు పట్టించారు. కేసు పెట్టారు. నెల్లూరుకు చెందిన దేవరాజ్, మేనేజర్ మల్లికార్జున్ ఈ మోసం వెనుక సూత్రధారులుగా తేలింది. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసుల్ని కోరుతున్నారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్