యు.ఏ.ఈ:ఈ ఉల్లంఘనకి పాల్పడితే 50,000 దిర్హామ్ల జరీమానా
- July 17, 2018
యు.ఏ.ఈ:అబుదాబీ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, వాటర్ క్రాఫ్ట్ ఓనర్లకు సంబంధించి జరీమానా రిమైండర్ని జారీ చేసింది. జెట్ స్కీ ఇంజిన్ నెంబర్ల టాంపరింగ్కి పాల్పడితే 50,000 దిర్హామ్ల వరకు జరీమానా విధించనున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ పేర్కొంది. ఈ ఉల్లంఘనకు పాల్పడితే జెట్ స్కీ లైసెన్స్ రద్దు చేయడంతోపాటు, దాన్ని స్వాధీనం చేసుకోవడమూ జరుగుతుంది. బీచ్కి 200 మీటర్ల లోపల జెట్ స్కీ వినియోగిస్తే జరీమానా తప్పదు. పర్సనల్ వాటర్ క్రాఫ్ట్స్కి సంబంధించిన నిబంధనల ప్రకారం మొదటి పెనాల్టీ 500 దిర్హామ్లు కాగా, రెండో పెనాల్టీకి 1000 దిర్హామ్లు చెల్లించాలి. మూడో పెనాల్టీకి 2000 దిర్హామ్ల జరీమానా విధించబడటమే కాకుండా వాహనాన్ని నెల రోజులపాటు స్వాధీనం చేసుకుంటారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









