యు.ఏ.ఈ:ఈ ఉల్లంఘనకి పాల్పడితే 50,000 దిర్హామ్ల జరీమానా
- July 17, 2018
యు.ఏ.ఈ:అబుదాబీ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, వాటర్ క్రాఫ్ట్ ఓనర్లకు సంబంధించి జరీమానా రిమైండర్ని జారీ చేసింది. జెట్ స్కీ ఇంజిన్ నెంబర్ల టాంపరింగ్కి పాల్పడితే 50,000 దిర్హామ్ల వరకు జరీమానా విధించనున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ పేర్కొంది. ఈ ఉల్లంఘనకు పాల్పడితే జెట్ స్కీ లైసెన్స్ రద్దు చేయడంతోపాటు, దాన్ని స్వాధీనం చేసుకోవడమూ జరుగుతుంది. బీచ్కి 200 మీటర్ల లోపల జెట్ స్కీ వినియోగిస్తే జరీమానా తప్పదు. పర్సనల్ వాటర్ క్రాఫ్ట్స్కి సంబంధించిన నిబంధనల ప్రకారం మొదటి పెనాల్టీ 500 దిర్హామ్లు కాగా, రెండో పెనాల్టీకి 1000 దిర్హామ్లు చెల్లించాలి. మూడో పెనాల్టీకి 2000 దిర్హామ్ల జరీమానా విధించబడటమే కాకుండా వాహనాన్ని నెల రోజులపాటు స్వాధీనం చేసుకుంటారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







