మరో నెల రోజుల పాటు మీడియాతో మాట్లాడకూడదు
- July 18, 2018
థాయ్లాండ్ థామ్ లువాంగ్ గుహలో చిక్కుకుని 18 రోజుల నరకం తర్వాత బయటపడిన పిల్లలు, వారి ఫుట్బాల్ కోచ్ మీడియాతో మాట్లాడారు. చిన్నారులు, వారికి చికిత్స అందిస్తున్న వైద్యులతో కలసి మాట్లాడారు. గుహలో తాము ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను మీడియాతో పంచుకున్నారు. తొలుత చిన్నారులు అందరికి నమస్కారం చెబుతూ, ఫుట్బాల్ చేతిలో పట్టుకొని వేదికగా వద్దకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన స్థలంలో కొద్ది సేపు ఫుట్బాల్ ఆడారు. వారు సరాదాగా ఫుట్బాల్ ఆడిన వీడియో వైరల్గా మారింది.
చిన్నారులతో పాటు వారి కోచ్ కూడా ఆరోగ్యంగా ఉన్నట్టు డాక్టర్లు వెల్లడించారు. వారందరి బరువు సరాసరిగా 3 కేజీలు పెరిగినట్టు తెలిపారు. మరోవైపు వైద్యులు సూచించిన ప్రశ్నలను మాత్రమే అడిగేందుకు అనుమతించారు. వారందరి మానసిక సమతుల్యత మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. చికిత్స ముగియడంతో అందరినీ ఇళ్లకు పంపించారు. బాలలను, వారి తల్లిదండ్రులను మరో నెల రోజుల వరకు మీడియాలో మాట్లాడకూడదని చెప్పి పంపారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







