అఫ్ఘాన్లో తాలిబన్ల దాడి
- July 20, 2018
కాబూల్ : అఫ్ఘనిస్థాన్లోని ఘజినీ ప్రావిన్స్లో తాలిబన్లు మెరుపుదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 8 మంది పోలీసులు మృతి చెందారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఘజినీ ప్రావిన్స్ గవర్నర్ కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం...ఖారబాగ్ జిల్లాలోని పోలీసు సెక్యూరిటీ పోస్టుపై తాలిబన్లు మెరుపుదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 8 మంది పోలీసులు మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్టు తాలిబన్ల అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ప్రకటించారు. తాలిబన్ల దాడి నేపథ్యంలో అక్కడి భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. పరిసర ప్రాంతాల్లో ముమ్మర సోదాలు నిర్వహిస్తున్నాయి. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







