అమెరికా:కాల్‌ సెంటర్‌ కుంభకోణం ..21మంది భారతీయులకు శిక్ష

- July 21, 2018 , by Maagulf
అమెరికా:కాల్‌ సెంటర్‌ కుంభకోణం ..21మంది భారతీయులకు శిక్ష

భారత్‌ కేంద్రంగా జరిగిన కాల్‌ సెంటర్‌ కుంభకోణంలో అమెరికా కోర్టు శిక్షలు విధించింది. 21 మంది భారత సంతతి వ్యక్తులకు దాదాపు 20ఏళ్ళ వరకు జైలుశిక్ష విధించింది. నకిలీ కాల్‌సెంటర్ల పేరుతో కొందరు వ్యక్తులు అమెరికాలో వేలాది మందిని మోసం చేసి వందల మిలియన్ల డాలర్లు కొట్టేసారు. శిక్ష పడిన వారిని శిక్షా కాలం పూర్తయిన తర్వాత భారత్‌కు పంపించేస్తారు. అహ్మదాబాద్‌లోని నకిలీ కాల్‌ సెంటర్ల ద్వారా భారత రెవెన్యూ అధికారులమని, అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్‌ అధికారులమని చెప్పిఈ మోసానికి పాల్పడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com