ఐదు రోజుల ఆఫ్రికా పర్యటనకు మోదీ
- July 22, 2018
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేటి నుంచి (జులై 23) నుంచి 27 వరకు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఆఫ్రికా దేశాలైన రువాండ, ఉగాండ, దక్షిణాఫ్రికా దేశాల్లో పర్యటించనున్నారు.
23, 24 తేదీల్లో ప్రధాని మోదీ రువాండలో పర్యటించనున్నారు. భారత ప్రధానులు ఎవరూ ఇప్పటి వరకు రువాండలో పర్యటించలేదు. తొలిసారిగా ప్రధాని మోదీ.. రువాండ వెళ్తున్నారు. ఇది చారిత్రక పర్యటనగా అభివర్ణించింది భారత విదేశీ మంత్రిత్వ శాఖ. రక్షణ శాఖకు సంబంధించిన పలు కీలక అంశాలపై మోదీ రువాండతో ఒప్పందం కుదుర్చుకొనే అవకాశం ఉంది.
రెండు రోజుల రువాండ పర్యటన ముగించుకొని 24, 25 తేదీల్లో మోదీ ఉగాండలో పర్యటించనున్నారు. ఉగాండ పార్లమెంట్లో మోదీ ప్రసంగించనున్నారు. అనంతరం మూడు రోజులపాటు- 25 నుంచి 27వరకు దక్షిణాఫ్రికాలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. దక్షిణాఫ్రికాలో జరిగే బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) సదస్సులో మోదీ పాల్గొననున్నారు. ప్రపంచ శాంతి, రక్షణ, పలు అంతర్జాతీయ సమస్యలపై సమావేశంలో చర్చించనున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







