ఐదు రోజుల ఆఫ్రికా పర్యటనకు మోదీ
- July 22, 2018
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేటి నుంచి (జులై 23) నుంచి 27 వరకు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఆఫ్రికా దేశాలైన రువాండ, ఉగాండ, దక్షిణాఫ్రికా దేశాల్లో పర్యటించనున్నారు.
23, 24 తేదీల్లో ప్రధాని మోదీ రువాండలో పర్యటించనున్నారు. భారత ప్రధానులు ఎవరూ ఇప్పటి వరకు రువాండలో పర్యటించలేదు. తొలిసారిగా ప్రధాని మోదీ.. రువాండ వెళ్తున్నారు. ఇది చారిత్రక పర్యటనగా అభివర్ణించింది భారత విదేశీ మంత్రిత్వ శాఖ. రక్షణ శాఖకు సంబంధించిన పలు కీలక అంశాలపై మోదీ రువాండతో ఒప్పందం కుదుర్చుకొనే అవకాశం ఉంది.
రెండు రోజుల రువాండ పర్యటన ముగించుకొని 24, 25 తేదీల్లో మోదీ ఉగాండలో పర్యటించనున్నారు. ఉగాండ పార్లమెంట్లో మోదీ ప్రసంగించనున్నారు. అనంతరం మూడు రోజులపాటు- 25 నుంచి 27వరకు దక్షిణాఫ్రికాలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. దక్షిణాఫ్రికాలో జరిగే బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) సదస్సులో మోదీ పాల్గొననున్నారు. ప్రపంచ శాంతి, రక్షణ, పలు అంతర్జాతీయ సమస్యలపై సమావేశంలో చర్చించనున్నారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







