బంగారం, వెండి ధరలు మరింత తగ్గాయి
- July 27, 2018
న్యూఢిల్లీ: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం డిమాండ్ బాగా తగ్గిపోయింది. స్థానిక నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో బులియన్ మార్కెట్లో బంగారం ధర దిగొచ్చింది. శుక్రవారం మార్కెట్లో 10గ్రాముల బంగారం ధర రూ. 190 తగ్గడంతో రూ.30,740గా ఉంది.
నగల వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడంతోపాటు ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెరగడం కూడా బులియన్ సెంటిమెంట్పై ప్రభావం చూపిందని మార్కెట్ల వర్గాలు చెబుతున్నాయి. ఇక వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడిచాయి.
గత రెండ్రోజులుగా పెరుగుదలను నమోదు చేసినప్పటికీ శుక్రవారం మాత్రం ధరలు తగ్గుముఖం పట్టాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడంతో వెండి ధర స్వల్పంగా తగ్గింది. రూ. 230 తగ్గడంతో శుక్రవారం మార్కెట్లో కిలో వెండి ధర రూ.39,200 పలికింది.
అంతర్జాతీయంగానూ బంగారం, వెండి ధరలు పడిపోయాయి. 0.73శాతం తగ్గిన బంగారం ధరలు.. న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు ధర 1.222.40డాలర్లుగా ఉంది. 1.48శాతం తగ్గి ఔన్సు వెండి ధర 15.35డాలర్లుగా ఉంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







