బంగారం, వెండి ధరలు మరింత తగ్గాయి
- July 27, 2018
న్యూఢిల్లీ: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం డిమాండ్ బాగా తగ్గిపోయింది. స్థానిక నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో బులియన్ మార్కెట్లో బంగారం ధర దిగొచ్చింది. శుక్రవారం మార్కెట్లో 10గ్రాముల బంగారం ధర రూ. 190 తగ్గడంతో రూ.30,740గా ఉంది.
నగల వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడంతోపాటు ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెరగడం కూడా బులియన్ సెంటిమెంట్పై ప్రభావం చూపిందని మార్కెట్ల వర్గాలు చెబుతున్నాయి. ఇక వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడిచాయి.
గత రెండ్రోజులుగా పెరుగుదలను నమోదు చేసినప్పటికీ శుక్రవారం మాత్రం ధరలు తగ్గుముఖం పట్టాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడంతో వెండి ధర స్వల్పంగా తగ్గింది. రూ. 230 తగ్గడంతో శుక్రవారం మార్కెట్లో కిలో వెండి ధర రూ.39,200 పలికింది.
అంతర్జాతీయంగానూ బంగారం, వెండి ధరలు పడిపోయాయి. 0.73శాతం తగ్గిన బంగారం ధరలు.. న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు ధర 1.222.40డాలర్లుగా ఉంది. 1.48శాతం తగ్గి ఔన్సు వెండి ధర 15.35డాలర్లుగా ఉంది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







