ఇండియా:35 ఏళ్ల లోపువారికి ఇన్కం టాక్స్ రద్దు!
- July 27, 2018
అవును.. ఇది నిజ్జంగా నిజం. అతిత్వరలో ఇది కార్యరూపం దాల్చినా ఆశ్చర్యం లేదు. యువకుల ఓటు బ్యాంకుని కొల్లగొట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎత్తుకున్న కొత్త స్లోగన్ ఇది! 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే.. 35 ఏళ్ల లోపు వయసున్న వాళ్లందరికీ ఆదాయ పన్ను నుంచి మినహాయింపునిస్తామన్నది తాజా హామీ. ఈనెల 13న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రాహుల్ ఈ ప్రతిపాదనపై సీరియస్ గా చర్చించినట్లు సమాచారం. ప్రయివేటు ఉద్యోగవర్గాల్ని బుట్టలో వేసుకోవాలంటే ఇదొక చక్కటి మార్గమని, సాధ్యాసాధ్యాలపై సలహాలు-సూచనలు తీసుకుంటున్నామని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు చెబుతున్నారు. స్వల్ప ఆదాయ వర్గాలకు, ఆర్థికంగా నిలదొక్కుకునేవరకూ ఆదాయపన్ను కట్టే పని లేకుండా ఉపశమనం కలిగించడమే ఈ హామీ ఉద్దేశమట! తదనుగుణంగా ఐటీ స్లాబుల్ని మార్చడం ద్వారా భారం తగ్గించుకోవచ్చన్న ఆలోచన కూడా ఏఐసీసీలో జరుగుతోంది!
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







