ఇండియా:35 ఏళ్ల లోపువారికి ఇన్కం టాక్స్ రద్దు!
- July 27, 2018
అవును.. ఇది నిజ్జంగా నిజం. అతిత్వరలో ఇది కార్యరూపం దాల్చినా ఆశ్చర్యం లేదు. యువకుల ఓటు బ్యాంకుని కొల్లగొట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎత్తుకున్న కొత్త స్లోగన్ ఇది! 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే.. 35 ఏళ్ల లోపు వయసున్న వాళ్లందరికీ ఆదాయ పన్ను నుంచి మినహాయింపునిస్తామన్నది తాజా హామీ. ఈనెల 13న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రాహుల్ ఈ ప్రతిపాదనపై సీరియస్ గా చర్చించినట్లు సమాచారం. ప్రయివేటు ఉద్యోగవర్గాల్ని బుట్టలో వేసుకోవాలంటే ఇదొక చక్కటి మార్గమని, సాధ్యాసాధ్యాలపై సలహాలు-సూచనలు తీసుకుంటున్నామని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు చెబుతున్నారు. స్వల్ప ఆదాయ వర్గాలకు, ఆర్థికంగా నిలదొక్కుకునేవరకూ ఆదాయపన్ను కట్టే పని లేకుండా ఉపశమనం కలిగించడమే ఈ హామీ ఉద్దేశమట! తదనుగుణంగా ఐటీ స్లాబుల్ని మార్చడం ద్వారా భారం తగ్గించుకోవచ్చన్న ఆలోచన కూడా ఏఐసీసీలో జరుగుతోంది!
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







