ఇండియా:35 ఏళ్ల లోపువారికి ఇన్కం టాక్స్ రద్దు!
- July 27, 2018
అవును.. ఇది నిజ్జంగా నిజం. అతిత్వరలో ఇది కార్యరూపం దాల్చినా ఆశ్చర్యం లేదు. యువకుల ఓటు బ్యాంకుని కొల్లగొట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎత్తుకున్న కొత్త స్లోగన్ ఇది! 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే.. 35 ఏళ్ల లోపు వయసున్న వాళ్లందరికీ ఆదాయ పన్ను నుంచి మినహాయింపునిస్తామన్నది తాజా హామీ. ఈనెల 13న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రాహుల్ ఈ ప్రతిపాదనపై సీరియస్ గా చర్చించినట్లు సమాచారం. ప్రయివేటు ఉద్యోగవర్గాల్ని బుట్టలో వేసుకోవాలంటే ఇదొక చక్కటి మార్గమని, సాధ్యాసాధ్యాలపై సలహాలు-సూచనలు తీసుకుంటున్నామని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు చెబుతున్నారు. స్వల్ప ఆదాయ వర్గాలకు, ఆర్థికంగా నిలదొక్కుకునేవరకూ ఆదాయపన్ను కట్టే పని లేకుండా ఉపశమనం కలిగించడమే ఈ హామీ ఉద్దేశమట! తదనుగుణంగా ఐటీ స్లాబుల్ని మార్చడం ద్వారా భారం తగ్గించుకోవచ్చన్న ఆలోచన కూడా ఏఐసీసీలో జరుగుతోంది!
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







