హైదరాబాద్:9న ఐకియా ఫర్నీచర్ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళనలు
- July 29, 2018హైదరాబాద్: ఆగస్టు 9న ఐకియా ఫర్నీచర్ కంపెనీకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు, దిష్టిబొమ్మల దహనం, కలెక్టరేట్ ఆఫీసుల ముట్టడి వంటి కార్యక్రమాలను విశ్వకర్మలు చేపట్టాలని విశ్వకర్మ సంఘం కార్పొరేషన్ పాలకమండలి రాష్ట్ర అధ్యక్షుడు కాతోజు రామాచారి పిలుపునిచ్చారు. ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టారు. విశ్వకర్మ కార్పొరేషన్ పాలకమండలి సాధన సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో సమావేశం జరిగింది. సమావేశంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ మాట్లాడారు. స్వీడన్ దేశానికి చెందిన ఐకియా ఫర్నీచర్ కంపెనీ హైదరాబాద్లోని హైటెక్ సిటీలో 200 ఎకరాల విస్తీర్ణంలో ఆగస్టు 9న ప్రారంభిస్తున్నారని తెలిపారు. ఈ కంపెనీ వల్ల లక్షలాది మంది విశ్వకర్మలు వృత్తి కోల్పోయి ఉపాధి లేక రోడ్డునపడే ప్రమాదం ఉందన్నారు. ఐకియా కంపెనీని ఏర్పాటు చేస్తే అందులో 90 శాతం ఉద్యోగాలు విశ్వకర్మలకు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో వి.వేణుగోపాల్ చారి, రుద్రోజు శివలింగం, నాగార్జున మధుసూదనాచారి, సాయిబాబు, ఆశయ్య తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?