హైదరాబాద్:9న ఐకియా ఫర్నీచర్ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళనలు
- July 29, 2018
హైదరాబాద్: ఆగస్టు 9న ఐకియా ఫర్నీచర్ కంపెనీకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు, దిష్టిబొమ్మల దహనం, కలెక్టరేట్ ఆఫీసుల ముట్టడి వంటి కార్యక్రమాలను విశ్వకర్మలు చేపట్టాలని విశ్వకర్మ సంఘం కార్పొరేషన్ పాలకమండలి రాష్ట్ర అధ్యక్షుడు కాతోజు రామాచారి పిలుపునిచ్చారు. ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టారు. విశ్వకర్మ కార్పొరేషన్ పాలకమండలి సాధన సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో సమావేశం జరిగింది. సమావేశంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ మాట్లాడారు. స్వీడన్ దేశానికి చెందిన ఐకియా ఫర్నీచర్ కంపెనీ హైదరాబాద్లోని హైటెక్ సిటీలో 200 ఎకరాల విస్తీర్ణంలో ఆగస్టు 9న ప్రారంభిస్తున్నారని తెలిపారు. ఈ కంపెనీ వల్ల లక్షలాది మంది విశ్వకర్మలు వృత్తి కోల్పోయి ఉపాధి లేక రోడ్డునపడే ప్రమాదం ఉందన్నారు. ఐకియా కంపెనీని ఏర్పాటు చేస్తే అందులో 90 శాతం ఉద్యోగాలు విశ్వకర్మలకు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో వి.వేణుగోపాల్ చారి, రుద్రోజు శివలింగం, నాగార్జున మధుసూదనాచారి, సాయిబాబు, ఆశయ్య తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









