హైదరాబాద్:9న ఐకియా ఫర్నీచర్ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళనలు
- July 29, 2018
హైదరాబాద్: ఆగస్టు 9న ఐకియా ఫర్నీచర్ కంపెనీకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు, దిష్టిబొమ్మల దహనం, కలెక్టరేట్ ఆఫీసుల ముట్టడి వంటి కార్యక్రమాలను విశ్వకర్మలు చేపట్టాలని విశ్వకర్మ సంఘం కార్పొరేషన్ పాలకమండలి రాష్ట్ర అధ్యక్షుడు కాతోజు రామాచారి పిలుపునిచ్చారు. ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టారు. విశ్వకర్మ కార్పొరేషన్ పాలకమండలి సాధన సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో సమావేశం జరిగింది. సమావేశంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ మాట్లాడారు. స్వీడన్ దేశానికి చెందిన ఐకియా ఫర్నీచర్ కంపెనీ హైదరాబాద్లోని హైటెక్ సిటీలో 200 ఎకరాల విస్తీర్ణంలో ఆగస్టు 9న ప్రారంభిస్తున్నారని తెలిపారు. ఈ కంపెనీ వల్ల లక్షలాది మంది విశ్వకర్మలు వృత్తి కోల్పోయి ఉపాధి లేక రోడ్డునపడే ప్రమాదం ఉందన్నారు. ఐకియా కంపెనీని ఏర్పాటు చేస్తే అందులో 90 శాతం ఉద్యోగాలు విశ్వకర్మలకు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో వి.వేణుగోపాల్ చారి, రుద్రోజు శివలింగం, నాగార్జున మధుసూదనాచారి, సాయిబాబు, ఆశయ్య తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







