బహ్రెయిన్:ఈస్ట్‌ ఎకెర్‌ విధ్వంసకారులకు జైలు శిక్ష

- July 31, 2018 , by Maagulf
బహ్రెయిన్:ఈస్ట్‌ ఎకెర్‌ విధ్వంసకారులకు జైలు శిక్ష

బహ్రెయిన్:ఈస్ట్‌ ఎకెర్‌ విలేజ్‌లో విధ్వంసానికి కారణమైన ముగ్గురు వ్యక్తులకు న్యాయస్థానం ఏడేళ్ళ జైలు శిక్ష ఖరారు చేసింది. 2017 మార్చి 18న ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయాలన్న ఆలోచనతో, ఈ ముగ్గురూ విధ్వంసాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ని దుండగులు తగలబెట్టారు. పోలీస్‌ అధికారులపైనా దాడులకు పాల్పడ్డారు. విచారణలో నిందితుల నేరం నిరూపణ కావడంతో న్యాయస్థానం వీరికి శిక్షల్ని ఖరారు చేసింది. విధ్వంసాలకు పాల్పడటం, ఫైర్‌ బాంబ్స్‌ని తయారు చేసి పేల్చడం వంటి అభియోగాలు వీరిపై నిరూపించడ్డాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com