దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్: 1 మిలియన్ డాలర్స్ గెల్చుకున్న ఇండియన్
- July 31, 2018
దుబాయ్:భారత జాతీయుడు సందీప్ మీనన్, దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్ తాజా విన్నర్గా నిలిచారు. 277 సిరీస్లో 2095 టిక్కెట్పై సందీప్, బంపర్ ప్రైజ్ మనీ గెల్చుకున్నారు. 1 మిలియన్ డాలర్స్ గెల్చుకోవడం చాలా గొప్ప విషయంగానే చెప్పుకోవాలి. ఈ బహుమతి గెల్చుకున్న 132వ భారతీయుడిగా సందీప్ రికార్డులకెక్కారు. ఇప్పటిదాకా తాను తన జీవితంలో ఎప్పుడూ ఇలాంటి గొప్ప బహుమతి అందుకోలేదనీ, ఈ సందర్భంగా దుబాయ్ డ్యూటీ ఫ్రీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని మీనన్ అన్నారు. మరో ఇద్దరు విజేతలకు లగ్జరీ వెహికిల్స్ దక్కాయి. దుబాయ్కి చెందిన ఈజిప్టియన్ నేషనల్ హొస్సామ్ హుస్సేన్ సల్మాన్ బిఎండబ్ల్యు 750ఐ లగ్జరీ కార్ని గెల్చుకోగా, దుబాయ్లో స్థిరపడ్డ మరో ఇండియన్ శాంతి బోస్ బిఎండబ్ల్యు ఆర్ 9టి స్క్రాంబ్లర్ని గెల్చుకున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







