ఇరాన్:హస్సన్ రౌహానీ ప్రభుత్వంపై అసంతృప్తి
- August 02, 2018
టెహరాన్: అమెరికాతో పోటాపోటీగా యుద్ధానికి తలపడుతున్న ఇరాన్లో అధ్యక్షడు హస్సన్ రౌహానీ పై క్రమంగా వ్యతిరేకత పెరుగుతోంది. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ పడిపోవటం, ఆర్థిక వ్యవస్థ మందగమనంలో సాగటం వంటి అంశాలలో ఇరాన్లోని వివిధ పార్టీలు ఆగ్రహంతో ఉన్నాయి. ఆర్ధిక వ్యవస్థ ఛిన్నా భిన్నం అవటంపై వివరణ ఇవ్వాలని, పార్లమెంటు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అందుకోసం అత్యవసరంగా పార్లమెంటును బుధవారం సమావేశం చేయాలని డిమాండ్ చేసారు. అందుకు స్పందించిన రౌహానీ ప్రభుత్వం బుధవారం నాడు పార్లమెంటును సమావేశం పరచుతోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్యదేశాలతో ఇరాన్కు కుదిరిన అణు ఒప్పందం నుండి ఇటీవల అమెరికా వైదొలిగింది. ఒప్పందాల వల్ల ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఆపదని అందుకు దాడులే మార్గమని ఐరోపా మిత్ర దేశాలతో కలిసి గత రెండు నెలలగా ఇరాన్పై దాడులు చేస్తోంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







