ఇరాన్:హస్సన్ రౌహానీ ప్రభుత్వంపై అసంతృప్తి
- August 02, 2018
టెహరాన్: అమెరికాతో పోటాపోటీగా యుద్ధానికి తలపడుతున్న ఇరాన్లో అధ్యక్షడు హస్సన్ రౌహానీ పై క్రమంగా వ్యతిరేకత పెరుగుతోంది. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ పడిపోవటం, ఆర్థిక వ్యవస్థ మందగమనంలో సాగటం వంటి అంశాలలో ఇరాన్లోని వివిధ పార్టీలు ఆగ్రహంతో ఉన్నాయి. ఆర్ధిక వ్యవస్థ ఛిన్నా భిన్నం అవటంపై వివరణ ఇవ్వాలని, పార్లమెంటు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అందుకోసం అత్యవసరంగా పార్లమెంటును బుధవారం సమావేశం చేయాలని డిమాండ్ చేసారు. అందుకు స్పందించిన రౌహానీ ప్రభుత్వం బుధవారం నాడు పార్లమెంటును సమావేశం పరచుతోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్యదేశాలతో ఇరాన్కు కుదిరిన అణు ఒప్పందం నుండి ఇటీవల అమెరికా వైదొలిగింది. ఒప్పందాల వల్ల ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఆపదని అందుకు దాడులే మార్గమని ఐరోపా మిత్ర దేశాలతో కలిసి గత రెండు నెలలగా ఇరాన్పై దాడులు చేస్తోంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







