ఇరాన్:హస్సన్ రౌహానీ ప్రభుత్వంపై అసంతృప్తి
- August 02, 2018
టెహరాన్: అమెరికాతో పోటాపోటీగా యుద్ధానికి తలపడుతున్న ఇరాన్లో అధ్యక్షడు హస్సన్ రౌహానీ పై క్రమంగా వ్యతిరేకత పెరుగుతోంది. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ పడిపోవటం, ఆర్థిక వ్యవస్థ మందగమనంలో సాగటం వంటి అంశాలలో ఇరాన్లోని వివిధ పార్టీలు ఆగ్రహంతో ఉన్నాయి. ఆర్ధిక వ్యవస్థ ఛిన్నా భిన్నం అవటంపై వివరణ ఇవ్వాలని, పార్లమెంటు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అందుకోసం అత్యవసరంగా పార్లమెంటును బుధవారం సమావేశం చేయాలని డిమాండ్ చేసారు. అందుకు స్పందించిన రౌహానీ ప్రభుత్వం బుధవారం నాడు పార్లమెంటును సమావేశం పరచుతోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్యదేశాలతో ఇరాన్కు కుదిరిన అణు ఒప్పందం నుండి ఇటీవల అమెరికా వైదొలిగింది. ఒప్పందాల వల్ల ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఆపదని అందుకు దాడులే మార్గమని ఐరోపా మిత్ర దేశాలతో కలిసి గత రెండు నెలలగా ఇరాన్పై దాడులు చేస్తోంది.
తాజా వార్తలు
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను పరామర్శించిన గవర్నర్ అబ్దుల్ నజీర్







