ఇరాన్:హస్సన్ రౌహానీ ప్రభుత్వంపై అసంతృప్తి
- August 02, 2018
టెహరాన్: అమెరికాతో పోటాపోటీగా యుద్ధానికి తలపడుతున్న ఇరాన్లో అధ్యక్షడు హస్సన్ రౌహానీ పై క్రమంగా వ్యతిరేకత పెరుగుతోంది. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ పడిపోవటం, ఆర్థిక వ్యవస్థ మందగమనంలో సాగటం వంటి అంశాలలో ఇరాన్లోని వివిధ పార్టీలు ఆగ్రహంతో ఉన్నాయి. ఆర్ధిక వ్యవస్థ ఛిన్నా భిన్నం అవటంపై వివరణ ఇవ్వాలని, పార్లమెంటు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అందుకోసం అత్యవసరంగా పార్లమెంటును బుధవారం సమావేశం చేయాలని డిమాండ్ చేసారు. అందుకు స్పందించిన రౌహానీ ప్రభుత్వం బుధవారం నాడు పార్లమెంటును సమావేశం పరచుతోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సభ్యదేశాలతో ఇరాన్కు కుదిరిన అణు ఒప్పందం నుండి ఇటీవల అమెరికా వైదొలిగింది. ఒప్పందాల వల్ల ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఆపదని అందుకు దాడులే మార్గమని ఐరోపా మిత్ర దేశాలతో కలిసి గత రెండు నెలలగా ఇరాన్పై దాడులు చేస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









