భారత గణతంత్ర వేడుకలకు ఆహ్వానం అందింది..
- August 02, 2018
అమెరికా:2019లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవ్వాలంటూ భారత ప్రభుత్వం పంపిన ఆహ్వానంపై అమెరికా దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష భవనం వైట్ హౌస్ స్పందించింది. భారత ప్రభుత్వం ఆహ్వానంపై ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. త్వరలోనే ట్రంప్ ఓ నిర్ణయానికి వస్తారని తెలిపింది. దీంతో ట్రంప్ భారత్కు వస్తారా?లేదా? అన్న దానిపై సందిగ్ధత నెలకొంది.
'రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలంటూ భారత ప్రభుత్వం పంపిన ఆహ్వానం అందింది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు' అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ సారా శాండర్స్ మీడియాకు చెప్పారు. త్వరలో అమెరికా-భారత్ మధ్య 2+2 వ్యూహాత్మక చర్చలు జరుగుతాయని, ఆ తర్వాతే ట్రంప్ భారత పర్యటనపై ఓ నిర్ణయానికి వస్తారని తెలిపారు. 2+2 చర్చల్లో పాల్గొనడటానికి సెప్టెంబర్లో అమెరికా విదేశాంగ, రక్షణ మంత్రులు మైక్ పాంపెయో, జిమ్ మాటిస్లు భారతదేశాన్ని సందర్శిస్తారని సారా తెలిపారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







