భారత గణతంత్ర వేడుకలకు ఆహ్వానం అందింది..

- August 02, 2018 , by Maagulf
భారత గణతంత్ర వేడుకలకు ఆహ్వానం అందింది..

అమెరికా:2019లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవ్వాలంటూ భారత ప్రభుత్వం పంపిన ఆహ్వానంపై అమెరికా దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష భవనం వైట్ హౌస్ స్పందించింది. భారత ప్రభుత్వం ఆహ్వానంపై ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. త్వరలోనే ట్రంప్ ఓ నిర్ణయానికి వస్తారని తెలిపింది. దీంతో ట్రంప్‌ భారత్‌కు వస్తారా?లేదా? అన్న దానిపై సందిగ్ధత నెలకొంది.

'రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలంటూ భారత ప్రభుత్వం పంపిన ఆహ్వానం అందింది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు' అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ సారా శాండర్స్‌ మీడియాకు చెప్పారు. త్వరలో అమెరికా-భారత్‌ మధ్య 2+2 వ్యూహాత్మక చర్చలు జరుగుతాయని, ఆ తర్వాతే ట్రంప్ భారత పర్యటనపై ఓ నిర్ణయానికి వస్తారని తెలిపారు. 2+2 చర్చల్లో పాల్గొనడటానికి సెప్టెంబర్‌లో అమెరికా విదేశాంగ, రక్షణ మంత్రులు మైక్‌ పాంపెయో, జిమ్‌ మాటిస్‌లు భారతదేశాన్ని సందర్శిస్తారని సారా తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com