రెండోసారి జింబాబ్వే అధ్యక్షుడిగా 'ఎమర్సన్'
- August 02, 2018
జింబాబ్వే అధ్యక్ష ఎన్నికల్లో అధికార 'జాను-పీఎఫ్' పార్టీ విజయం సాధించింది. ప్రస్తుత అధ్యక్షుడు ఎమర్సన్ మునగాగ్వా(75)కు 50.8 శాతం ఓట్లు రాగా, ప్రతిపక్ష నాయకుడు నెల్సన్ చమీసాకు 44.3 శాతం ఓట్లు వచ్చాయి. రెండో దఫా ఎన్నికలను ఎమర్సన్ మునగాగ్వా తప్పించుకున్నారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు 'పోలింగ్ సమయంలో ప్రజలు వర్గాలుగా విభజించబడినా మనందరి కలలను సాకారం చేసుకోవడానికి ఐకమత్యంతో కలుసుందాం. ఇదో కొత్త ఆరంభం. ప్రేమ, శాంతి, ఐకమత్యంతో అందరం కలిసి కొత్త జింబాబ్వేని నిర్మిద్దాము' అని ట్విట్టర్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







