రెండోసారి జింబాబ్వే అధ్యక్షుడిగా 'ఎమర్సన్‌'

- August 02, 2018 , by Maagulf
రెండోసారి జింబాబ్వే అధ్యక్షుడిగా 'ఎమర్సన్‌'

జింబాబ్వే అధ్యక్ష ఎన్నికల్లో అధికార 'జాను-పీఎఫ్‌' పార్టీ విజయం సాధించింది. ప్రస్తుత అధ్యక్షుడు ఎమర్సన్‌ మునగాగ్వా(75)కు 50.8 శాతం ఓట్లు రాగా, ప్రతిపక్ష నాయకుడు నెల్సన్ చమీసాకు 44.3 శాతం ఓట్లు వచ్చాయి. రెండో దఫా ఎన్నికలను ఎమర్సన్‌ మునగాగ్వా తప్పించుకున్నారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు 'పోలింగ్‌ సమయంలో ప్రజలు వర్గాలుగా విభజించబడినా మనందరి కలలను సాకారం చేసుకోవడానికి ఐకమత్యంతో కలుసుందాం. ఇదో కొత్త ఆరంభం. ప్రేమ, శాంతి, ఐకమత్యంతో అందరం కలిసి కొత్త జింబాబ్వేని నిర్మిద్దాము' అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com