రియాద్-ముంబయి జెట్ ఎయిర్వేస్ విమానానికి తప్పిన ప్రమాదం
- August 02, 2018
సౌదీ అరేబియాలోని రియాద్ నుంచి ముంబయికి రావాల్సిన జెట్ ఎయిర్వేస్ విమానానికి ఈరోజు త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. 149మందితో విమానం రియాద్ నుంచి టేకాఫ్ అవుతుండగా రన్వేపై జారింది. ఈ ఘటన అనంతరం ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఎవ్వరికీ గాయాలు కాలేదని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. '142మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందితో ఆగస్టు 3న రియాద్ నుంచి ముంబయికి రావాల్సిన 9డబ్ల్యు523 విమానం టేకాఫ్ ఆగిపోయింది. రియాద్ విమానాశ్రయంలోని రన్వే నుంచి తిరిగి వెనక్కి వెళ్లిపోయింది. మా ప్రయాణికులు, సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారు. అందరినీ విమానం నుంచి బయటకు తరలించాం. ఎవ్వరికీ గాయాలు కాలేదు' అని జెట్ ఎయిర్వేస్ ఓ ప్రకనటలో వెల్లడించింది. స్థానిక అధికారులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారని, తమ బృందం వారికి పూర్తి సహకారం అందిస్తోందని తెలిపింది.
తమకు ప్రయాణికులు, సిబ్బంది భద్రత చాలా ముఖ్యమని జెట్ ఎయిర్వేస్ పేర్కొంది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే వరకు రియాద్ విమానాశ్రయంలోని టర్మినల్ భవనంలో బస ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









