రియాద్-ముంబయి జెట్ ఎయిర్వేస్ విమానానికి తప్పిన ప్రమాదం
- August 02, 2018సౌదీ అరేబియాలోని రియాద్ నుంచి ముంబయికి రావాల్సిన జెట్ ఎయిర్వేస్ విమానానికి ఈరోజు త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. 149మందితో విమానం రియాద్ నుంచి టేకాఫ్ అవుతుండగా రన్వేపై జారింది. ఈ ఘటన అనంతరం ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఎవ్వరికీ గాయాలు కాలేదని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. '142మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందితో ఆగస్టు 3న రియాద్ నుంచి ముంబయికి రావాల్సిన 9డబ్ల్యు523 విమానం టేకాఫ్ ఆగిపోయింది. రియాద్ విమానాశ్రయంలోని రన్వే నుంచి తిరిగి వెనక్కి వెళ్లిపోయింది. మా ప్రయాణికులు, సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారు. అందరినీ విమానం నుంచి బయటకు తరలించాం. ఎవ్వరికీ గాయాలు కాలేదు' అని జెట్ ఎయిర్వేస్ ఓ ప్రకనటలో వెల్లడించింది. స్థానిక అధికారులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారని, తమ బృందం వారికి పూర్తి సహకారం అందిస్తోందని తెలిపింది.
తమకు ప్రయాణికులు, సిబ్బంది భద్రత చాలా ముఖ్యమని జెట్ ఎయిర్వేస్ పేర్కొంది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే వరకు రియాద్ విమానాశ్రయంలోని టర్మినల్ భవనంలో బస ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్
- OMR30.6 బిలియన్లు దాటిన క్రెడిట్ బ్యాలెన్స్
- యూఏఈలో CSI చర్చి.. ఫస్ట్ లుక్ ఔట్
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!