రియాద్-ముంబయి జెట్ ఎయిర్వేస్ విమానానికి తప్పిన ప్రమాదం
- August 02, 2018
సౌదీ అరేబియాలోని రియాద్ నుంచి ముంబయికి రావాల్సిన జెట్ ఎయిర్వేస్ విమానానికి ఈరోజు త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. 149మందితో విమానం రియాద్ నుంచి టేకాఫ్ అవుతుండగా రన్వేపై జారింది. ఈ ఘటన అనంతరం ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఎవ్వరికీ గాయాలు కాలేదని, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. '142మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బందితో ఆగస్టు 3న రియాద్ నుంచి ముంబయికి రావాల్సిన 9డబ్ల్యు523 విమానం టేకాఫ్ ఆగిపోయింది. రియాద్ విమానాశ్రయంలోని రన్వే నుంచి తిరిగి వెనక్కి వెళ్లిపోయింది. మా ప్రయాణికులు, సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారు. అందరినీ విమానం నుంచి బయటకు తరలించాం. ఎవ్వరికీ గాయాలు కాలేదు' అని జెట్ ఎయిర్వేస్ ఓ ప్రకనటలో వెల్లడించింది. స్థానిక అధికారులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారని, తమ బృందం వారికి పూర్తి సహకారం అందిస్తోందని తెలిపింది.
తమకు ప్రయాణికులు, సిబ్బంది భద్రత చాలా ముఖ్యమని జెట్ ఎయిర్వేస్ పేర్కొంది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే వరకు రియాద్ విమానాశ్రయంలోని టర్మినల్ భవనంలో బస ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన