దుబాయ్ లో 'సైమా' కు రంగం సిద్ధం
- August 05, 2018
దుబాయ్:సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్(సైమా), 2018 సంబరం మొదలైంది. సెవెంత్ ఎడిషన్ సైమా అవార్డ్స్ ఈవెంట్ సెప్టెంబర్ 14, 15 తేదీలలో దుబాయ్లో వైభవంగా జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక అవార్డ్స్ ఫంక్షన్ ను 'అంజన్ స్టార్ ఈవెంట్స్' సంస్థ నిర్వహించనున్నట్టు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ ఉగ్గిన ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని 'బాలీవుడ్ పార్క్స్' లో నిర్వహించనున్నారు. 14వ తేదీన తెలుగు, కన్నడ భాషలకు సంబంధించిన నటీనటులకు అవార్డులు ఇవ్వనుండగా.. 15వ తేదీన తమిళ్, మలయాళ భాషలకు చెందిన నటీనటులకు అవార్డులను అందజేయనున్నారు. ఈ వేడుకకు కన్నడ, మలయాళం, తమిళ్, తెలుగు నుంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరుకానున్నారు.
నటీమణుల రాక్ పెర్ఫార్మెన్స్తో, సెలబ్రిటీల ఆటపాటలతో ఈ వేడుక వైభవంగా జరగనుంది. ఈ అవార్డ్స్కి సంబంధించి సినిమాల ఎంపిక జరిగింది. 2017లో విడుదలైన తెలుగు, కన్నడ భాషల్లోని బెస్ట్ సినిమాల ఎంపిక జరిగింది. ఈ ఎంపికలో రానాకు సంబంధించిన మూడు సినిమాలు ఉండటం విశేషం. బాహుబలి 2, ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి సినిమాలు వీటిలో ఉన్నాయి. దీంతో ఈ అవార్డ్స్కి సంబంధించి రానాయే రాజుగా కనిపిస్తున్నాడు. ఈ సైమా అవార్డ్స్ నామినేషన్స్లో వివిధ కేటగిరీలకు సంబంధించి బాహుబలి 2 సినిమా 12 నామినేషన్స్ను పొందింది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







