దేశీయ విమానాలకు కంప్లయింట్ల తంటా
- August 05, 2018
దిల్లీ: దేశీయ విమానయాన సంస్థలపై కేవలం 20 నెలల సమయంలో 7,200కు పైగా ఫిర్యాదులు అందినట్లు ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం ద్వారా వెల్లడైంది. పౌర విమానయాన శాఖకు చెందిన ఎయిర్సేవ విభాగానికి 2016 డిసెంబరు నుంచి ఈ ఏడాది జులై వరకు 7,251 ఫిర్యాదులు అందినట్లు ప్రభుత్వం ఇటీవల పార్లమెంటుకు వెల్లడించింది. విమానాల ఆలస్యంపై 2,233 ఫిర్యాదులు అందాయని, టిక్కెట్ ధరలు, రీఫండ్లపై 1753, సిబ్బంది ప్రవర్తనపై 377 ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. ఇటీవల దేశీయ విమాన ప్రయాణాలపై ఫిర్యాదులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రయాణికుల పట్ల సిబ్బంది దురుసుగా ప్రవర్తించిన కేసులూ అధికంగా నమోదవుతున్నాయి. ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని విమానయాన సంస్థలు సిబ్బందికి సూచనలు ఇస్తూనే ఉన్నాయి. గత ఏడాదికి ఈ ఏడాదికి ఎయిర్ ట్రాఫిక్ కూడా బాగా పెరిగింది. ముఖ్యంగా ఈ ఏడాది జనవరి, జూన్ల మధ్య అధికంగా 6.84కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారు. ప్రయాణికులు ఎక్కువగా ఉన్న సమయాల్లో బ్యాగేజీ విషయంలో ఫిర్యాదులు ఎక్కువగా అందుతున్నాయి.
ఈ ఏడాది జూన్లో అందిన ఫిర్యాదుల్లో 27.5శాతం బ్యాగులకు సంబంధించినవే అని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెల్లడించింది.
తాజా వార్తలు
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్







