కోసం కొత్త సెట్ రెడీ చేసిన సైరా బృందం
- August 06, 2018
'సైరా' సినిమా సెట్ను షేర్లింగంపల్లి రెవెన్యూ అధికారులు కూల్చి వేయడం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఐతే, ఈ చర్యపై చిత్రబృందం ఎవ్వరు కూడా స్పందించకపోవడం కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. సైలైంట్ గా చిత్రబృందం కొత్త సెట్ ని రెడీ చేసుకొనే పనిలో పడింది. ఇప్పుడా పని పూర్తయినట్టు సమాచారం.
కొత్త సెట్ లో రేపటి నుంచి షెడ్యూల్ మొదలుకానుంది. ప్రత్యేకంగా రూపొందించిన సెట్లో ఏకధాటిగా నెలరోజుల పాటు షూటింగ్ నిర్వహించనున్నారు. బ్రిటిషర్స్, నరసింహారెడ్డి మధ్య సాగే సన్నివేశాలు, ఫైట్స్ చిత్రీకరిస్తారని సమాచారం. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్చరణ్ నిర్మిస్తున్నారు.
ఇక, ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







