భారత దేశ వ్యాప్తంగా ప్రజా రవాణా బంద్..

- August 06, 2018 , by Maagulf
భారత దేశ వ్యాప్తంగా ప్రజా రవాణా బంద్..

ఇవాళ (మంగళవారం)భారత దేశ వ్యాప్తంగా రవాణా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోనున్నాయి. ఆటో నుంచి ఆర్టీసీ బస్సు వరకు రోడ్డెక్కే పరిస్థితే లేదు. కేంద్రం తేబోతున్న మోటార్ యాక్ట్ బిల్లుకు వ్యతిరేకంగా కార్మికులు దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమయ్యారు. MV యాక్ట్ స‌వ‌ర‌ణతో దేశంలోని అన్ని ఆర్టీసీలు నిర్వీర్యం అవుతాయ‌ని.. ర‌వాణా రంగం అస్థవ్య‌స్తంగా త‌యార‌వుతుంద‌ని ఆందోళ‌న వ్యక్తమవుతోంది.

మోటార్ వెహికిల్ చ‌ట్ట‌ సవరణ బిల్లు 2017 ర‌వాణ రంగంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశంలో ప్రస్తుతం19 కోట్లకు పైగా మోటారు వాహనాలు తిరుగుతున్నాయి. 15 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు. కొత్త ఎంవీ యాక్ట్ అమల్లోకి వస్తే చాలామంది ఉపాధి కొల్పోతారనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆటోలు, క్యాబ్ లతో పాటు ఆర్టీసీపై కూడా ప్రభావం ఎక్కువగా వుంటుందని రోడ్డు రవాణా కార్మిక సంఘాల నేతలు అంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com