వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసులు తనిఖీలు

- December 14, 2015 , by Maagulf
వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసులు తనిఖీలు

ఏపీ వ్యాప్తంగా వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసులు సోదాలు జరిపారు. పోలీసులు వడ్డీ వ్యాపారుల నుంచి భారీగా ప్రామిసరీ నోట్లు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ, గుంటూరులలోని వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసులు తనిఖీలు చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోనూ పోలీసులు సోదాలు జరిపారు. ఐదుగురు వడ్డీ వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి కీలకపత్రాలు, బాండ్లను స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దొనబండలో ఇద్దరు వడ్డీ వ్యాపారులను అరెస్ట్‌ చేశారు. వారినుంచి ప్రామిసరీ నోట్లు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. కాల్‌మనీ వ్యాపారుల ఇళ్లలోనూ సోదాలు జరిపారు. పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com