షార్జాలో పెళ్ళయిన రెండు రోజులకే వధువు మృతి
- August 09, 2018
షార్జాలో ఓ మహిళ పెళ్ళయిన రెండు రోజులకే రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈ ప్రమాదంలో భర్తకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో అతనికి వైద్య చికిత్స అందుతోంది. అల్ కాసిమి హాస్పిటల్లో వైద్య చికిత్స అందుతోంది. మల్టిపుల్ ఫ్రాక్చర్స్తో వరుడు బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. సోమవారం ఈ ప్రమాదం జరిగింది. పాతికేళ్ళ వధువు హుయామ్, తన భర్త మొహ్మద్ అబ్దుల్లా అల్ జలాఫ్ తో కలిసి అల్ బయ్యాలోని కుటుంబ సభ్యుల్ని కలిసేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. షార్జాకి తిరిగి వస్తున్న క్రమంలో ఎమిరేట్స్ రోడ్డు పై ప్రమాదం జరిగినట్లు వైద్యులు తెలిపారు. డ్రైవింగ్ చేస్తున్న వరుడు, ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడి, ఓ ట్రక్ని ఢీకొట్టినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







