నవంబర్ 8న నిఖిల్ "ముద్ర"
- August 10, 2018
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ "ముద్ర". టి.ఎన్.సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జర్నలిజం నేపథ్యంలో తెరకెక్కుతుండడం విశేషం. అలాగే.. కరెంట్ ఇష్యుస్ సాల్వ్ చేయడంలో మీడియా ఎటువంటి కీలకపాత్ర పోషిస్తుంది అనే విషయాన్ని ఈ చిత్రం ద్వారా చూపించనున్నారు. నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్ ప్రస్తుతం చిత్రీకరణలో ఉంది. సెప్టెంబర్ కల్లా షూటింగ్ పూర్తిచేసి నవంబర్ 8న చిత్రాన్ని విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
నిఖిల్ ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభించింది, అతడు జర్నలిస్ట్ గా నటించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
కావ్య వేణుగోపాల్-రాజ్ కుమార్ ఔరా సినిమాస్ ప్రయివేట్ లిమిటెడ్-మూవీ డైనమిక్స్ ఎల్.ఎల్.పి సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బి.మధు సమర్పిస్తున్నారు.
నటీనటులు:
నిఖిల్ సిద్ధార్థ్
లావణ్య త్రిపాఠి
వెన్నెల కిషోర్
పోసాని కృష్ణమురళి
తరుణ్ అరోరా
సత్య
నాగినీడు
సాంకేతిక నిపుణులు:
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: టి.ఎన్. సంతోష్
నిర్మాతలు: కావ్య వేణుగోపాల్-రాజ్ కుమార్
కెమెరా: సూర్య
సంగీతం: సామ్ సి.ఎస్
ఆర్ట్: సాహి సురేష్
ఫైట్స్: వెంకట్
కాస్ట్యూమ్ డిజైనర్: రాగారెడ్డి
డైరెక్షన్ డిపార్ట్మెంట్: రమా రమేష్, రఘునాధ్, లోకేష్, భరత్, అరుల్, బ్రహ్మ
పబ్లిసిటీ డిజైనర్: అనిల్-భాను
పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్







