హైదరాబాద్ విమానాశ్రయం విస్తరణ...
- August 10, 2018హైదరాబాద్:హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ పనులను ఎల్ అండ్ టీ, మెగావైడ్ కార్పోరేషన్ సంస్థలు చేజిక్కించుకున్నాయి. జీఎంఆర్ ఇన్ఫ్రా అనుబంధ సంస్థ అయిన జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (జీఎంఆర్-హెచ్ఐఏఎల్) ఈ విషయాన్ని శుక్రవారం స్టాక్ ఎక్స్జేంజీలకు వెల్లడించింది. హైదరాబాద్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీఎంఆర్-హెచ్ఐఏఎల్ సంస్థ విమానాశ్రయ టెర్మిన ల్ బిల్డింగ్ను, ఎయిర్సైడ్ ఇన్ఫ్రా అనుబంధ మౌలిక వసతులను అభివృద్ధి పరచాలని నిర్ణయించి అంతర్జాతీయ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. ఏడాదికి 3.4 కోట్ల మంది ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా ఈ విస్తరణ పనులను చేపట్టాలని జీఎంఆర్ నిర్ణయించింది. టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం, ఎయిరసైడ్ ఇన్ఫ్రాకు సంబంధించి నిర్వహించిన బిడ్డింగ్ ప్రక్రియలో ఎల్1గా నిలిచిన ఎల్ అండ్ టీ సంస్థకు రూ.3,028 కోట్ల విలువైన పనులను, మెగావైడ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్కు రూ.980 కోట్ల విలువైన పనులను అప్పగిస్తూ లెటర్ ఆఫ్ అవార్డును జారీ చేసినట్టుగా జీఎంఆర్-హెచ్ఐఏఎల్ తెలిపింది. ఈ విమానాశ్రయ విస్తరణ పనులు అవార్డయిన 42 నెలలో పూర్తి కానున్నట్టుఆ జీఎంఆర్ తెలిపింది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్