ఉదయాన్నే పరగడుపునే వేడి నీటిని తాగితే ఉపయోగాలు
- August 10, 2018నీరు శరీరానికి ఎంత అవసరమనే విషయం అందరికీ తెలిసిందే. నీటిని సాధారణ రూపంలో కాకుండా వేడిగా ఉన్నప్పుడు తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. ఆ వేడి నీటిని పరగడుపున తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
పరగడుపున వేడి నీటిని తీసుకోవడం వలన రక్తప్రసరణ మెరుగుపడుతుంది. శరీరంలోని మలినాలు, చెడు పదార్థాలు, వ్యర్థాలు బయటికి వెళ్లిపోతాయి. జీర్ణక్రియ మెరుగుపరచుటలో వేడి నీళ్లు చక్కగా పనిచేస్తాయి. పైల్స్ సమస్యలతో బాధపడేవారు వేడి నీటిని తీసుకుంటే ఇలాంటి సమస్యల నుండి విముక్తి చెందవచ్చును.
ఉదయాన్నే రెండు గ్లాసుల వేడి నీటి తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా శరీరంలోని వేడి వేగంగా కరిగిపోతుంది. శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. ఉదయాన్నే తినడానికి ముందుగా గ్లాస్ వేడి నీటిని తీసుకుంటే కడుపు నొప్పి వంటి సమస్యలు తొలగిపోతాయి.
శరీర మెటబాలిజం వేగవంతమవుతుంది. ఈ వేడినీళ్లు క్యాలరీలను తొలగించుటలో చక్కని ఔషధంగా పనిచేస్తాయి. శ్వాస కోశ సమస్యలు దూరమవుతాయి. శ్వాస ప్రక్రియ మెరుగుపడుతుంది.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన