హైదరాబాద్ విమానాశ్రయం విస్తరణ...
- August 10, 2018
హైదరాబాద్:హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ పనులను ఎల్ అండ్ టీ, మెగావైడ్ కార్పోరేషన్ సంస్థలు చేజిక్కించుకున్నాయి. జీఎంఆర్ ఇన్ఫ్రా అనుబంధ సంస్థ అయిన జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (జీఎంఆర్-హెచ్ఐఏఎల్) ఈ విషయాన్ని శుక్రవారం స్టాక్ ఎక్స్జేంజీలకు వెల్లడించింది. హైదరాబాద్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీఎంఆర్-హెచ్ఐఏఎల్ సంస్థ విమానాశ్రయ టెర్మిన ల్ బిల్డింగ్ను, ఎయిర్సైడ్ ఇన్ఫ్రా అనుబంధ మౌలిక వసతులను అభివృద్ధి పరచాలని నిర్ణయించి అంతర్జాతీయ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. ఏడాదికి 3.4 కోట్ల మంది ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా ఈ విస్తరణ పనులను చేపట్టాలని జీఎంఆర్ నిర్ణయించింది. టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం, ఎయిరసైడ్ ఇన్ఫ్రాకు సంబంధించి నిర్వహించిన బిడ్డింగ్ ప్రక్రియలో ఎల్1గా నిలిచిన ఎల్ అండ్ టీ సంస్థకు రూ.3,028 కోట్ల విలువైన పనులను, మెగావైడ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్కు రూ.980 కోట్ల విలువైన పనులను అప్పగిస్తూ లెటర్ ఆఫ్ అవార్డును జారీ చేసినట్టుగా జీఎంఆర్-హెచ్ఐఏఎల్ తెలిపింది. ఈ విమానాశ్రయ విస్తరణ పనులు అవార్డయిన 42 నెలలో పూర్తి కానున్నట్టుఆ జీఎంఆర్ తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







