హైదరాబాద్ విమానాశ్రయం విస్తరణ...
- August 10, 2018హైదరాబాద్:హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ పనులను ఎల్ అండ్ టీ, మెగావైడ్ కార్పోరేషన్ సంస్థలు చేజిక్కించుకున్నాయి. జీఎంఆర్ ఇన్ఫ్రా అనుబంధ సంస్థ అయిన జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (జీఎంఆర్-హెచ్ఐఏఎల్) ఈ విషయాన్ని శుక్రవారం స్టాక్ ఎక్స్జేంజీలకు వెల్లడించింది. హైదరాబాద్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీఎంఆర్-హెచ్ఐఏఎల్ సంస్థ విమానాశ్రయ టెర్మిన ల్ బిల్డింగ్ను, ఎయిర్సైడ్ ఇన్ఫ్రా అనుబంధ మౌలిక వసతులను అభివృద్ధి పరచాలని నిర్ణయించి అంతర్జాతీయ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. ఏడాదికి 3.4 కోట్ల మంది ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా ఈ విస్తరణ పనులను చేపట్టాలని జీఎంఆర్ నిర్ణయించింది. టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం, ఎయిరసైడ్ ఇన్ఫ్రాకు సంబంధించి నిర్వహించిన బిడ్డింగ్ ప్రక్రియలో ఎల్1గా నిలిచిన ఎల్ అండ్ టీ సంస్థకు రూ.3,028 కోట్ల విలువైన పనులను, మెగావైడ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్కు రూ.980 కోట్ల విలువైన పనులను అప్పగిస్తూ లెటర్ ఆఫ్ అవార్డును జారీ చేసినట్టుగా జీఎంఆర్-హెచ్ఐఏఎల్ తెలిపింది. ఈ విమానాశ్రయ విస్తరణ పనులు అవార్డయిన 42 నెలలో పూర్తి కానున్నట్టుఆ జీఎంఆర్ తెలిపింది.
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు